49 శాతానికి ఎఫ్డీఐ ‘పరిమితి’
దేశంలో ఇంకా సుప్తావస్తలోనే ఉన్న బీమా రంగం మరింత వేళ్లూనుకోవాలంటే... ప్రభుత్వం నుంచి తగిన సహాయసహకారాలు కావాలని పరిశ్రమ కోరుతోంది. ముఖ్యంగా మోడీ నేతృత్వంలోని కొత్తసర్కారు తమ రంగానికి తొలి బడ్జెట్లో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని అంటోంది.
ఎఫ్డీఐల పరిమితి పెంపే కీలకం...
ప్రధానంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుడుల(ఎఫ్డీఐ) పరిమితిని పెంచాలని బీమా కంపెనీలు ఎప్పటినుంచో ముక్తకంఠంతో చెబుతున్నాయి. దీనివల్ల నిధుల లభ్యత పెరిగి వ్యాపార విస్తరణకు దోహదం చేస్తుందని పేర్కొంటున్నాయి. ప్రస్తుతం బీమా రంగంలో 26 శాతం ఎఫ్డీఐలకు అనుమతి ఉంది. దీన్ని 49 శాతానికి పెంచాలనేది పరిశ్రమ డిమాండ్. గత యూపీఏ ప్రభుత్వం దీనికి 2013 జూలైలో ఆమోదం తెలిపింది. అయితే, పార్లమెంట్ ఆమోదానికి లోబడి మాత్రమే ఈ పరిమితి పెంపు ఉంటుందని పేర్కొంది.
ఇతర ముఖ్య విజ్ఞప్తులు ఇవీ...
1. బ్యాంకులను అన్నిరకాల ఇన్సూరెన్స్ కంపెనీల బీమా పాలసీలను విక్రయించేందుకు వీలుగా బ్రోకర్గా అనుమతించాలి. ప్రస్తుతం కార్పొరేట్ ఏజెంట్గా మాత్రమే బ్యాంకులకు అనుమతి ఉంది. అదీకూడా లైఫ్, నాన్-లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్లకు చెందిన ఒక్కో కంపెనీకి మాత్రమే ఏజెంట్గా వ్యవహరించాలనేది నిబంధన.
2. ఆరోగ్య బీమా పథకాలవైపు ప్రజలను ఆకర్షితులను చేయాలంటే ఆదాయపు పన్ను(ఐటీ) మినహాయింపుల పరిమితిని పెంచాలి. ప్రస్తుతం సెక్షన్ 80డీ ప్రకారం రూ.15,000 వరకూ ఆరోగ్యబీమా పాలసీకి పన్ను ఆదాయం నుంచి మినహాయింపు అమల్లో ఉంది. దీన్ని రూ.50 వేలకు పెంచాలని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు కోరుతున్నాయి.
3. మరింత మందికి ఆరోగ్యబీమా పథకాలవైపు మొగ్గుచూపేలా చేయడానికి పన్ను మినహాయింపు పరిమితి పెంపు తప్పనిసరి.
4. వైపరీత్యాలను కవర్ చేసే విధంగా అందిస్తున్న పాలసీలపట్ల ప్రజలను ఆకర్షితులు చేయాలంటే ఇలాంటి పాలసీలపై వ్యయానికికూడా పన్ను మినహాయింపులు ఇవ్వాలి.
బీమా పరిశ్రమ డిమాండ్...
Published Sat, Jun 28 2014 12:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రశాంతంగా సీఎం టూర్
కలప స్వాధీనం
రామయ్యకు వైభవంగా సువర్ణ తులసీ అర్చన
క్రీడా సెక్రటరీ పోస్టుకు జోరుగా పైరవీలు !
వడదెబ్బ మృతులకు ప్రభుత్వ సాయం
సమష్టి కృషితోనే సంస్థ అభివృద్ధి
వన్యప్రాణుల వేటకు యత్నించిన ముగ్గురి అరెస్ట్
ఘనంగా కేవీకే స్వర్ణోత్సవాలు
మొదటి నెల పర్వాలేదు..
అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement