శామ్‌సంగ్ నుంచి మరో 4జీ స్మార్ట్‌ఫోన్ | Sakshi
Sakshi News home page

శామ్‌సంగ్ నుంచి మరో 4జీ స్మార్ట్‌ఫోన్

Published Mon, Aug 3 2015 11:46 PM

శామ్‌సంగ్ నుంచి మరో 4జీ స్మార్ట్‌ఫోన్

న్యూఢిల్లీ: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అగ్రగామి శామ్‌సంగ్, తన గెలాక్సీ గ్రాండ్ ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌లో కొత్త 4జీ వేరియంట్ ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.11,100. ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5 అంగుళాల తెర, 1.2 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 8 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 2,600 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement