ఆర్థిక మంత్రిత్వశాఖ వివరణ
► బిల్లులో 60 శాతాన్ని మినహాయించి మిగిలిన 40 శాతంపై ట్యాక్స్
► దీని ప్రకారం ‘ఎఫెక్టివ్ రేట్’ 5.6%
న్యూఢిల్లీ: సేవల పన్నుకు సంబంధించి ఆర్థిక మంత్రిత్వశాఖ మంగళవారం ఒక కీలక వివరణ ఇచ్చింది. ఎయిర్ కండీషనింగ్ (ఏసీ) లేదా సెంట్రల్ హీటింగ్ (సీహెచ్) సదుపాయం ఉన్న రెస్టారెంట్లకు మాత్రమే సేవల పన్ను వర్తిస్తుంది. అటువంటి సదుపాయం లేని రెస్టారెంట్లు వినియోగదారుల నుంచి సేవల పన్ను వసూలు చేయాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది.
మరిన్ని ముఖ్యాంశాలు...
ఎయిర్ కండీషనింగ్ లేదా సెంట్రల్ హీటింగ్ లేని రెస్టారెంట్లు తమ కస్టమర్ల నుంచి ఎటువంటి సేవల పన్ను నూ వసూలు చేయవు. ఏసీలేని హోటళ్లు, మెస్సులు. ఫుడ్ కోర్టులకు ట్యాక్స్ నుంచి మినహాయింపు.
♦ ఒకవేళ అలాంటి సదుపాయం ఉంటే మొత్తం బిల్లు సొమ్ములో 60 శాతాన్ని మినహాయించి మిగిలిన 40 శాతానికి మాత్రమే సేవల పన్ను ఉంటుంది. ఈ విధంగా చూస్తే మొత్తంగా సేవల పన్ను (ఎఫెక్టివ్ రేట్) 5.6 శాతంగా ఉంటుంది.
♦ సేవల పన్ను వర్తించకూడదంటే... రెస్టారెంట్లోని ఏ భాగంలోనూ ఏసీ లేదా సీహెచ్లు ఉండకూడదు.
♦ జూన్ 1 నుంచీ సేవల పన్నును 14 శాతానికి (విద్యా సుంకాన్ని కలుపుకుని) పెంచారు. దీని ప్రకారం, చార్జ్ చేసిన మొత్తంపై ఎఫెక్టివ్ రేటు 5.6 శాతం ఉంటుంది.
♦ జూన్ 1కి ముందు 12.36 శాతం సేవల పన్ను ఉన్నప్పుడు ఎఫెక్టివ్ రేట్ 4.94 శాతం.
♦ జూన్ 1 నుంచీ సేవల పన్ను పెంపు వల్ల హోటల్లో, రెస్టారెంట్లో భోజనం మాత్రమే కాదు. మొబైల్, ఇంటర్నెట్, విమాన ప్రయాణాలు, ఇంటర్నెట్లో తీసుకునే రైలు టికెట్లు, కేబుల్ సర్వీసులు, బ్యూటీ పార్లర్స్, హెల్త్ క్లబ్స్, వినోదం... ఇలా దాదాపు అన్ని సేవలూ ప్రియమయ్యాయి. పర్యాటకం, ఆతిథ్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, రవాణా, రియల్టీ, ఆటో రంగాలపై ప్రధానంగా ఈ భారం పడుతోంది.. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రకంగా సేవల పన్ను పెంపు భారం అయ్యింది.
♦ దేశీయ పరోక్ష పన్నుల వ్యవస్థ 2016 ఏప్రిల్ 1 నుంచీ ‘వస్తువులు, సేవల పన్ను’గా (జీఎస్టీ) మారుతోంది. ఈ కొత్త వ్యవస్థకు అనుగుణంగా సేవల పన్ను రేట్లను పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ 2015-16 బడ్జెట్ ప్రసంగం సందర్భంగా చెప్పారు.
ప్రభుత్వానికి లాభమెంత?
సేవల పన్ను ద్వారా కేంద్రానికి వచ్చిన మొత్తం గత ఆర్థిక సంవత్సరం రూ.1.68 లక్షల కోట్లు. తాజా పెంపు వల్ల ఈ మొత్తం 25 శాతం వృద్ధితో రూ.2.09 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. అంటే... దాదాపు రూ. 40 వేల కోట్ల రూపాయలు జనం జేబుల్లోంచి ప్రభుత్వ ఖజానాలోకి చేరుతాయన్న మాట.
ఏసీ రెస్టారెంట్లలోనే ఇక సేవల పన్ను
Published Tue, Jun 9 2015 11:41 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement