ఎయిర్‌సెల్ ఐపీఎల్ హై ఫ్లయర్ కాంటెస్ట్ | Sakshi
Sakshi News home page

ఎయిర్‌సెల్ ఐపీఎల్ హై ఫ్లయర్ కాంటెస్ట్

Published Thu, Apr 3 2014 1:48 AM

ఎయిర్‌సెల్ ఐపీఎల్ హై ఫ్లయర్ కాంటెస్ట్ - Sakshi

హైదరాబాద్: ఎయిర్‌సెల్ కంపెనీ వినియోగదారుల కోసం ఎయిర్‌సెల్ హై ఫ్ల్లయర్ కాంటెస్ట్‌ను ప్రారంభించింది. ఈ పోటీలో గెల్చిన అభ్యర్థులు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) క్రికెట్ జట్టుతో ప్రయాణించే, ఆ జట్టు బస చేసిన హోటల్‌లోనే బస చేసే అవకాశాలతో పాటు, ఈ జట్టు ఆడే ఐపీఎల్ మ్యాచ్‌లకు ఉచిత టికెట్లను పొందవచ్చని ఎయిర్‌సెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పోటీలో ప్రి-పెయిడ్, పోస్ట్ పెయిడ్ వినియోగదారులందరూ పాల్గొనవచ్చని ఎయిర్‌సెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, అనుపమ్ వాసుదేవ్ పేర్కొన్నారు. రూ.100 అంతకుమించి రీచార్జ్ చేసుకునే ప్రి-పెయిడ్ వినియోగదారులు, చివరి బిల్లులో ఎలాంటి బకాయిలు లేని పోస్ట్-పెయిడ్ వినియోగదారులు ఈ పోటీలో పాల్గొనవచ్చని తెలిపారు.

 దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమాన్ని బుధవారం నుంచే ప్రారంభించామని వివరించారు. ఇక ఈ పోటీలో పాల్గొనే వారందరికీ 10 నిమిషాల టాక్ టైమ్‌ను (ఎయిర్‌సెల్ నుంచి ఎయిర్‌సెల్)కు ఉచితంగా అందిస్తామని, అంతేకాకుండా ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించి 800 టికెట్లను గెల్చుకునే అవకాశముందని   అనుపమ్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement