సెప్టెంబర్ నుంచి ఎయిర్కోస్టా సర్వీసుల పెంపు | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ నుంచి ఎయిర్కోస్టా సర్వీసుల పెంపు

Published Wed, Aug 31 2016 1:10 AM

సెప్టెంబర్ నుంచి ఎయిర్కోస్టా సర్వీసుల పెంపు

గన్నవరం:  విమాన సంస్థ ఎయిర్‌కోస్టా సెప్టెంబర్ నుంచి కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయానికి సర్వీసులను పెంచనుంది. ప్రస్తుతం నడుస్తున్న బెంగళూరుకు మరో అదనపు సర్వీస్ తో పాటు విశాఖపట్నం వరకు సర్వీసులను విస్తరించనుంది. సెప్టెంబర్ 11 నుంచి హైదరాబాద్ మీదుగా జైపూర్‌కు కొ త్త సర్వీస్  ప్రారంభించనుంది. సెప్టెంబర్ ఒకటి నుంచి ఉదయం సర్వీస్ 7.15కు ఇక్కడ్నుంచి బయలుదేరి 8.15కు బెంగళూరు చేరుకుంటుంది. అక్కడినుంచి వైజాగ్‌కు 10.10 గంటలకు చేరుకుంటుంది.

తిరిగి అదే విమానం సాయంత్రం 18.15కు వైజాగ్‌లో బయలుదేరి 19.50కు బెంగళూరు చేరుకుని, అక్కడినుంచి రాత్రి 21.25కు గన్నవరం చేరుకుంటుంది. రెండవ సర్వీస్ ఉదయం 10.30కు వైజాగ్ నుంచి బయలుదేరి బెంగళూరు మీదుగా 13.35కు ఇక్కడికి చేరుకుంటుంది. తిరిగి ఇక్కడి నుంచి 15.00కు బయలుదేరి బెంగళూరు మీదుగా సాయంత్రం 17.55కు వైజాగ్‌కు చేరుకుంటుంది. ఉదయం 8.00కు ఇక్కడి నుంచి బయలుదేరి 08.50కు హైదరాబాద్ చేరుకుని కొద్ది విరామం అనంతరం బయలుదేరి 11.15కు జైపూర్‌కు చేరుకుంటుం ది. తిరిగి జైపూర్ నుంచి సాయంత్రం 16.00కు బయలుదేరి హైదరాబాద్ మీదుగా రాత్రి 21.15కు ఇక్కడికి చేరుకుంటుందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.

Advertisement
Advertisement