• జనవరి నాటికి దేశమంతా
• 5 లక్షల బ్యాంకింగ్ పాయింట్లు
• తెలుగు రాష్ట్రాల్లో సర్వీసులు ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ జనవరికల్లా దేశవ్యాప్తంగా సేవలను విస్తరించనుంది. ఇటీవలే రాజస్తాన్లో ప్రయోగాత్మకంగా సేవలు ప్రారంభించిన ఎయిర్టెల్... రెండు వారాల్లోనే 1,00,000 ఖాతాలను సాధించింది. బుధవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సేవలు మొదలుపెట్టింది. ఢిల్లీ వేదికగా వచ్చే నెలలో దేశవ్యాప్తంగా అధికారికంగా సేవలను ఆరంభించనుంది. డిజిటల్ రూపంలో నగదు స్వీకరించేలా 30 లక్షల మంది వర్తకులను సిద్ధం చేస్తామని ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఎండీ, సీఈవో శశి అరోరా బుధవారమిక్కడ మీడియాకు చెప్పారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల కస్టమర్లకే ప్రాధాన్యమిస్తామన్నారు. భారత్లో ఎయిర్టెల్కు 25 కోట్ల మంది సబ్స్క్రైబర్లు, 15 లక్షల రిటైల్ ఔట్లెట్లు ఉన్నాయి. పేమెంటు బ్యాంకు విస్తరణకు ఇవి దోహదం చేస్తాయని ఆయన వెల్లడించారు.
కస్టమర్లకు రుణాలు..
దేశవ్యాప్తంగా పేమెంట్స్ బ్యాంక్ విస్తరించిన తర్వాత ఇతర సేవలను అందిస్తామని శశి అరోరా వెల్లడించారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీతో చేతులు కలిపి ఖాతాదారులకు రుణాలు ఇప్పిస్తామన్నారు. ‘‘భారత్లో 23.3 కోట్ల మందికి బ్యాంకు ఖాతాల్లేవు. వీరందరినీ చేరుకోవాలన్నదే మా లక్ష్యం. ఆధార్ ఆధారంగా రెండు నిముషాల్లోనే ఉచితంగా ఖాతా తెరుస్తాం. కనీస బ్యాలెన్స్ అవసరం లేదు. కస్టమర్ మొబైల్ నంబరే ఖాతా సంఖ్య. తొలిసారి డిపాజిట్ చేసిన మొత్తానికి సమానంగా టాక్టైం ఇస్తున్నాం. డిపాజిట్లపై 7.25 శాతం వార్షిక వడ్డీ చెల్లిస్తాం. కస్టమర్లు ఎలాంటి డిజిటల్ చెల్లింపులైనా చేయొచ్చు. వీటికి ప్రాసెసింగ్ ఫీజు లేదు. వేరే బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేస్తే 0.5% చార్జీ ఉంటుంది. నగదు విత్డ్రాకు రూ.4 వేలలోపు రూ.25 వరకు, రూ.4 వేలపైన 0.65% చార్జీ చేస్తాం. బేసిక్ ఫోన్తోనూ బ్యాం కు ఖాతాను తెరవొచ్చు’ అని తెలిపారు. ఖాతాదారుకు రూ. లక్ష ఉచిత ప్రమాద బీమా ఉంది.
బ్యాంకింగ్ పాయింట్లుగా..: రీచార్జ్ ఔట్లెట్లుగా ఇప్పటిదాకా కస్టమర్లకు చేరువైన రిటైల్ కేంద్రాలు ఎయిర్టెల్ బ్యాంకింగ్ పాయింట్లుగా మారతాయి. వీటిలో ఖాతా తెరవడం, నగదు జమ, స్వీకరణ సేవలను కస్టమర్లు పొందవచ్చు. దేశవ్యాప్తంగా 5 లక్షల బ్యాంకింగ్ పాయింట్లు ఏర్పాటయ్యాయి. భాగస్వాముల పనితీరు ఆధారంగా రీచార్జ్ కేంద్రాలను బ్యాంకింగ్ పాయింట్లుగా తీర్చిదిద్దుతున్నట్టు ఏపీ, తెలంగాణ సర్కిల్ సీఈవో వెంకటేష్ విజయ్ రాఘవన్ తెలిపారు. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం 20,000 కేంద్రాల్లో బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. దశలవారీగా మరిన్ని కేంద్రాలకు విస్తరిస్తామన్నారు.
ఎయిర్టెల్ పెమెంట్స్ బ్యాంక్ సేవలు
Published Thu, Dec 15 2016 1:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నవీన్ పట్నాయక్ లక్ష్యం అదే.. వీకే పాండియన్
పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్
అకాయ్ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్డే సెలబ్రేషన్స్
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)
చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్
Betel Leaf: తమల పాకులతో హెయిర్ ఫాల్ సమస్యకు చెక్!
‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రధాని ఫొటో ఎటు పోయింది: మీసా భారతి
ఈ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయలేదంటే: జ్యోతిక
తప్పక చదవండి
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
- ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
- వంగా గీతని ఓడించడం ఎవరి వల్ల కాదు.. పవన్పై నటి శ్యామల షాకింగ్ కామెంట్స్
- Black Salt Benefits : బ్లాక్ సాల్ట్తో ఇన్ని లాభాలా?
- పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
Advertisement