డీల్ విలువ రూ.243 కోట్లు
ముంబై: అంతర్జాతీయ దిగ్గజం గోల్డ్మన్ శాక్స్ భారత మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్మెంట్ రూ.243 కోట్లకు కొనుగోలు చేయనున్నది. ఈ లావాదేవీ అంతా నగదు రూపేణా జరగనున్నది. రూ.13 లక్షల కోట్ల భారత మ్యూచువల్ ఫండ్ మార్కెట్ నుంచి తాజాగా మరో విదేశీ సంస్థ, గోల్డ్మన్ శాక్స్ వైదొలుగుతోంది. ఈ డీల్కు రెండు కంపెనీల డెరైక్టర్ల బోర్డులు ఆమోదం తెలిపాయని రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్మెంట్(ఆర్సీఏఎం) మాతృ సంస్థ రిలయన్స్ క్యాపిటల్ పేర్కొంది.
అనిల్ అంబానీ గ్రూప్కు చెందిన రిలయన్స్ క్యాపిటల్ బీమా, బ్రోకరేజ్, వెల్త్ మేనేజ్మెంట్ తదితర ఆర్ధిక సేవలనందిస్తోంది. గోల్డ్మన్ శాక్స్ కంపెనీ 2011లో రూ. 120 కోట్లకు బెంచ్మార్క్ మ్యూచువల్ ఫండ్ను కొనుగోలు చేయడం ద్వారా భారత మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలోకి ప్రవేశించింది. ఇటీవల కాలంలో అంతర్జాతీయ దిగ్గజాలు భారత మ్యూచువల్ ఫండ్ రంగం నుంచి నిష్ర్కమిస్తున్నాయి.
స్టాండర్ట్ చార్టర్డ్ సంస్థ తన మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని 2008లో ఐడీఎఫ్సీకి, ఫెడిలిటి సంస్థ తన మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని ఎల్ అండ్ టీ ఫైనాన్స్కు 2012లో విక్రయించాయి. మోర్గాన్ స్టాన్లీ ఫండ్ వ్యాపారాన్ని హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్ కొనుగోలు చేయగా, ఐఎన్జీ మ్యూచువల్ ఫండ్ను బిర్లా సన్లైఫ్, పైన్బ్రిడ్జ్ మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని కోటక్ ఎంఎఫ్, డాయిష్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని అమెరికా కొనుగోలు చేశాయి. ప్రస్తుతం భారత మ్యూచువల్ ఫండ్ రంగంలో 40కు పైగా సంస్థలు ఉన్నాయి.
రిలయన్స్ ఎంఎఫ్ చేతికి గోల్డ్మన్ శాక్స్ ఫండ్
Published Thu, Oct 22 2015 12:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement