బీజింగ్: టెక్నాలజీ దిగ్గజం యాపిల్... చైనాపై అధికంగా దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగానే అక్కడ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంది. యాపిల్ ఉత్పత్తుల విక్రయాలు చైనాలో క్షీణబాటలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సమస్యను అధిగమించడానికి, చైనాలో తన ఉనికిని స్థిరంగా అలాగే ఉంచుకోవాలనే ఉద్దేశంతో యాపిల్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది చివరకు చైనాలో ఒక స్వతంత్ర రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్అండ్డీ) సెంటర్ను ఏర్పాటు చేస్తామని యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. కాగా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో కంపెనీకి ఇది తొలి ఆర్అండ్డీ కేంద్రం కానుంది. కౌంటర్పాయింట్ రీసెర్చ్ ప్రకారం.. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో చైనా స్మార్ట్ఫోన్ మార్కెట్లో యాపిల్ ఐదవ స్థానానికి పడింది. తొలి నాలుగు స్థానాల్లో హువావే, వివొ, ఒప్పొ, షావోమి ఉన్నాయి.