ఔట్లెట్లలో అడ్వాన్స్ బుకింగ్స్ జోరు
భారత గ్రే మార్కెట్లో రూ. లక్షకు పైనే
అక్టోబర్ 16న భారత్లో విడుదల
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐఫోన్లో ఏ మోడల్ వచ్చినా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్. భారత్లో కూడా అందుకు మినహాయింపు ఏమీ లేదు. ఇక్కడి కస్టమర్లు మరికాస్త స్మార్ట్. భారత్లో అధికారికంగా విడుదలకు ముందే తమ చేతుల్లో కొత్త మోడల్ ఉండాల్సిందేనని అంటున్నారు. ఇందుకోసం ప్రీమియం ఎంతైనా చెల్లిస్తున్నారు. ఐఫోన్ కొత్త మోడళ్లు అయిన 6ఎస్, 6ఎస్ ప్లస్ సెప్టెంబర్ 25న యూఎస్, యూకే సహా 12 దేశాల్లో విడుదలయ్యాయి. భారత్లో అక్టోబర్ 16న విడుదల కానున్నాయి. అయితే భాగ్యనగరానికి చెందిన ఒక కస్టమర్ సెప్టెంబర్ 26నే 6ఎస్ను చేజిక్కించుకున్నారంటే ఇక్కడివారి ఆసక్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఫోన్ కోసం ఆయన చెల్లించిన మొత్తం అక్షరాలా రూ.1.20 లక్షలు. భారత్ గ్రే మార్కెట్లో ఈ ఫోన్ రూ. లక్షకుపైగానే పలుకుతోందని వ్యాపార వర్గాలు తెలిపాయి. నలుగురిలో ప్రత్యేకత ప్రదర్శించాలనుకునే ఇటువంటి ‘విలువైన’ కస్టమర్ల కోసం హాంకాంగ్, సింగపూర్ నుంచి కొందరు వ్యాపారులు ఫోన్లను తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఏడుగురు యువకుల నుంచి ఏకంగా 182 ఫోన్లను కస్టమ్స్ అధికారులు ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుకోవడం గమనార్హం.
రోజ్ గోల్డ్కే పట్టం..
ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ మోడళ్లను సిల్వర్, గోల్డ్, స్పేస్ గ్రే, రోజ్ గోల్డ్ రంగుల్లో ఆపిల్ రూపొంది ంచింది. తొలిసారిగా ప్రవేశపెట్టిన రోజ్ గోల్డ్కు ప్రపంచవ్యాప్తంగా విపరీత డిమాండ్ ఉంది. నల్ల బజారులో అధిక ధర పలుకుతున్న రంగు కూడా ఇదే కావడం విశేషం. ఆ తర్వాతి స్థానాన్ని స్పేస్ గ్రే కైవసం చేసుకుంది. చైనాలో అతిపెద్ద గ్రే మార్కెట్ అయిన హువాకియాంగ్బేలో రోజ్ గోల్డ్ రూ.2.15 లక్షలు పలికింది. ఐఫోన్ 5ఎస్ మోడల్ను తొలిసారిగా బంగారు వర్ణంలో ప్రవేశపెట్టినప్పుడు సైతం గ్రే మార్కెట్లో భారత్లో రూ.లక్షకు పైనే పలికింది. కాగా, 6ఎస్, 6ఎస్ ప్లస్ అడ్వాన్స్ బుకింగ్స్లో 70% మంది రోజ్ గోల్డ్ను కోరారని టెక్నోవిజన్ ఎండీ సికందర్ తెలిపారు. బిగ్ సి, లాట్లోనూ బుకింగ్స్లో 70% మంది ఇదే కలర్ను ఎంచుకున్నారు.
భారీ అంచనాలతో..
కొత్త మోడళ్లపై ఆపిల్కు భారీ అంచనాలే ఉన్నాయి. విడుదలైన 3 రోజుల్లోనే 1.3 కోట్ల యూనిట్లు అమ్ముడవడమే ఇందుకు కారణం. భారత్లో ఈ అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లో 7.2 లక్షల యూనిట్లను అమ్మాలని లక్ష్యంగా ఆపిల్ లక్ష్యంగా చేసుకుంది. అటు రిటైలర్లు ముందస్తు బుకింగ్స్ను ప్రారంభించారు. 500 బుకింగ్స్ నమోదయ్యాయని బిగ్ సీ చైర్మన్ బాలు చౌదరి తెలిపారు. 1,500 యూనిట్ల అమ్మకాలను దాటతామన్నారు. 400లకుపైగా బుకింగ్స్ అయ్యాయని, 1,300లకుపైగా యూనిట్లను విక్రయిస్తామన్న అంచనాలు ఉన్నాయని లాట్ మొబైల్స్ ఈడీ కృష్ణ పవన్ చెప్పారు. టెక్నోవిజన్ ఇప్పటికే 100కుపైగా బుకింగ్స్ను నమోదు చేసింది. భారత్లో 6ఎస్ ధర 16 జీబీ రూ.55,000, 64 జీబీ రూ.65,000, 128 జీబీ రూ.75,000 ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. 6ఎస్ ప్లస్ ధర వేరియంట్నుబట్టి అదనంగా రూ.8-9 వేలు ఉండొచ్చు.
ఐఫోన్ 6ఎస్ రోజ్ గోల్డ్ హల్చల్..
Published Mon, Oct 5 2015 8:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement