పన్ను ఎగవేత మార్గాలను మూసేస్తున్నామని వెల్లడి
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను రేటును సహేతుక స్థాయిలో ఉంచడమే ప్రభుత్వ ఉద్దేశమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ), ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక శాఖలు సంయుక్తంగా శనివారం నిర్వహించిన సమావేశాన్ని ఉద్దేశించి జైట్లీ మాట్లాడారు. పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచుకునే విషయమై ఆయన మాట్లాడుతూ... రిటర్నులు దాఖలు చేసే వారిని ఆదాయపన్ను శాఖ విశ్వసించడం ప్రారంభించాలని సూచించారు.
గత కొన్ని నెలల కాలంలో విధానాలు సులభతరం అయ్యాయని, ఐటీ శాఖ రిటర్నులు దాఖలు చేసే వారి పట్ల ఇంత స్నేహపూరితంగా వ్యవహరించడాన్ని ఎప్పుడూ చూసి ఉండరని అభిప్రాయపడ్డారు. విధానాలను సులభతరం చేసే లక్ష్యంతో చేపట్టిన పలు చర్యలను జైట్లీ ప్రస్తావించారు.
ఎగవేత దారులపై కఠిన చర్యలు
అదే సమయంలో పన్ను ఎగవేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని జైట్లీ హెచ్చరించారు. తప్పించుకునే మార్గాలకు చెక్ పెడుతున్నట్టు తెలిపారు. హెచ్ఎస్బీసీలో అక్రమంగా ఖాతాలు కలిగి ఉన్నవారు విచారణ ఎదుర్కొంటున్నారని, పనామా పేపర్లలో ఉన్న వారు సైతం విచారణ ఎదుర్కొనక తప్పదన్నారు. మారిషస్తో ఉన్న ఒప్పందాన్ని సవరించామని, భారత్లో ఆర్జిస్తూ పన్ను ఎగ్గొట్టే అవకాశం ఇకపై ఉండబోదన్నారు.
సైప్రస్తో ఉన్న ఒప్పందాన్ని కూడా సమీక్షించామని వచ్చే కొన్ని రోజుల్లో దీన్ని కేబినెట్ ఆమోదించనున్నట్టు వెల్లడించారు. సింగపూర్తో ఉన్న ద్వైపాక్షిక పన్ను ఒప్పందాన్ని సవరించే విషయమై సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. దేశంలో పన్ను రేటు సహేతుక స్థాయిలో ఉండాలని, చెల్లింపుదారుల సంఖ్య భారీగా ఉండాలని, ఐటీ విభాగం పన్ను చెల్లింపు దారులను, రిటర్నులు దాఖలు చేసే వారిని విశ్వసించాలని జైట్లీ అన్నారు. తమ ఆదాయాన్ని దాచి పెట్టి ఉంచిన వారికి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదాయ వెల్లడి (ఐడీఎస్) పథకం ఓ మంచి అవకాశంగా పేర్కొన్నారు.
పన్ను రేటు సహేతుకంగా ఉండాలి: జైట్లీ
Published Mon, Jul 4 2016 1:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement