న్యూఢిల్లీ: ఆర్థిక పురోభివృద్ధి కోసం తమ ప్రభుత్వం మరింత అధికంగా కష్టపడనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఇందుకు వీలుగా సంస్కరణలకు ఊపునిచ్చేందుకు అధిక సమయాన్నికేటాయించనున్నట్లు తెలిపారు. ప్రధానంగా బీమా, బొగ్గు రంగాలతోపాటు, వస్తుసేవల పన్ను(జీఎస్టీ) వంటి సంస్కరణల అమలుకి గట్టిగా కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు.
వచ్చే ఏడాదిలో జీడీపీలో 6-6.5% వృద్ధిని సాధించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఈ బాటలో వచ్చే వారం బీమా బిల్లును చేపట్టనున్నట్లు వివరించారు. ఒక టీవీ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో జైట్లీ ఈ విషయాలను వెల్లడించారు. జీఎస్టీ కోసం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.
2017లో 7% వృద్ధి
వచ్చే ఆర్థిక సంవత్సరం(2015-16)లో 6.5% ఆర్థిక వృద్ధిని సాధించగలమని నమ్ముతున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. ఆపై ఏడాది(2016-17)కి జీడీపీ 7% స్థాయిలో విస్తరించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భారీ మార్పులకు చోటుకల్పించే కీలక సంస్కరణలు ప్రవేశపెట్టడం లేదన్న విమర్శలపై స్పందిస్తూ జైట్లీ ప్రణాళికా సంఘం రద్దు వంటి సంచలనాత్మక నిర్ణయాలను వీళ్లు పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఇదే విధంగా డీజిల్ ధరలపై నియంత్రణల ఎత్తివేత అంశాన్ని ప్రస్తావించారు. వ్యయాల కమిషన్ నివేదిక అందిన తరువాత ప్రజాసంబంధ వ్యయాల క్రమబద్ధీకరణకు మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా సబ్సిడీలను కుదించనున్నట్లు తెలిపారు. బ్లాక్మనీ అంశంపై వివరణ ఇస్తూ 2015 మార్చి 31కల్లా 627 ఖాతాల పరిశీలన పూర్తి చేయనున్నట్లు చెప్పారు.
జైట్లీతో రాజన్ సమావేశం
న్యూఢిల్లీ: కీలక పాలసీ రేట్ల తగ్గింపునకు ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమయ్యారు. జైట్లీతో వివిధ ఆర్థిక అంశాలపై చర్చించినట్లు సమావేశం అనంతరం రాజన్ విలేకరులకు తెలియజేశారు. వడ్డీ తగ్గింపుపై ఒత్తిళ్ల కారణంగా ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
ఆర్బీఐతో చెట్టపట్టాల్: కాగాఆర్బీఐతో ప్రభుత్వం కలసికట్టుగా పనిచేస్తుందని ఆర్థిక మంత్రి జైట్లీ తాజాగా పేర్కొన్నారు. అయితే ప్రజాస్వామ్య దేశంలో ఆరోగ్యకరమైన రీతిలో వాదోపవాదాలు కొనసాగడం సహ జమని ఒక ఇంటర్వ్యూలో జైట్లీ వ్యాఖ్యానించారు. ఆర్బీఐ అనేది అనుభవం, నైపుణ్యాలు కలగలసిన సంస్థ అని, తమ బాధ్యతలకు అనుగుణంగా వ్యవహరించడంపైనే దృష్టిపెడుతుందన్నారు.
వృద్ధికి అధిక సమయం కష్టపడతాం: అరుణ్ జైట్లీ
Published Sat, Dec 13 2014 5:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
టీమిండియా కెప్టెన్కు టాలీవుడ్ స్టార్ హీరో విషెస్..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- ప్రియాంకాజీ మీ ప్రభుత్వం ఏం చేస్తోంది.. అమిత్ ప్రశ్నల వర్షం
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
- పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్
- ‘కాపు ఉద్యమాన్ని అణిచివేసింది మీరు కాదా?’
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
Advertisement