ముంబై: ప్రైవేట్ రంగంలో దేశీయంగా మూడో అతి పెద్ద బ్యాంక్ యాక్సిస్.. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 1,842 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది అంత క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4తో పోలిస్తే 18 శాతం అధికం. అప్పట్లో దాదాపు రూ. 9,055 కోట్ల ఆదాయంపై రూ. 1,555 కోట్ల లాభం ఆర్జించింది. తాజా క్యూ4లో ఆదాయం రూ. 10,179 కోట్లకు పెరిగింది. శుక్రవారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల ప్రకారం.. నికర వడ్డీ ఆదాయం 19 శాతం పెరిగి రూ. 2,665 కోట్ల నుంచి రూ. 3,166 కోట్లకు చేరింది.
నికర వడ్డీ మార్జిన్(నిమ్) సైతం 3.70 శాతం నుంచి 3.89%కి పెరిగింది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి గాను 200% మేర(రూ.20) డివిడెండ్ ఇవ్వాలని యాక్సిస్ బ్యాంక్ బోర్డు నిర్ణయించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం 180 శాతం (రూ. 18) డివిడెండ్ ఇచ్చింది. మరోవైపు, బ్యాంక్ బోర్డు.. షేర్ల విభజన ప్రతిపాదనను ఆమోదించింది. దీని ప్రకారం రూ. 10 ముఖ విలువ గల ఒక్కో షేరును రూ. 2 ముఖ విలువ గల 5 షేర్ల కింద విభజిస్తారు.
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను .. యాక్సిస్ బ్యాంక్ నికర లాభం 20 శాతం ఎగిసింది. రూ. 5,179 కోట్ల నుంచి సుమారు రూ. 6,218 కోట్లకు పెరిగింది. తొలిసారిగా బిలియన్ డాలర్ల మేర నికర లాభాన్ని ఆర్జించినట్లు బ్యాంక్ పేర్కొంది. మొత్తం ఆదాయం రూ. 33,734 కోట్ల నుంచి రూ. 38,046 కోట్లకు పెరిగింది. బాసెల్ త్రీ నిబంధనల ప్రకారం మార్చి ఆఖరు నాటికి మూలధన నిష్పత్తి (సీఏఆర్) 16.07 శాతంగా ఉన్నట్లు బ్యాంక్ వివరించింది. నికర వడ్డీ ఆదాయం, ఫీజుల కారణంగా లాభాలు గణనీయంగా పెరిగాయని యాక్సిస్ ఈడీ సోమ్నాథ్ సేన్గుప్తా వివరించారు. రియల్టీ, కార్లు.. వాణిజ్య వాహన రుణాల విభాగాల్లో పనితీరు కొంత మందకొడిగా ఉందని, అయితే సెంటిమెంట్ కొంతైనా మెరుగుపడితే పరిస్థితుల్లో మార్పు రాగలదని తెలిపారు.
1.22 శాతానికి స్థూల ఎన్పీఏలు..
బ్యాంక్ ఇచ్చిన రుణాల్లో స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 1.22%కి పెరిగాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇవి 1.06 శాతంగా ఉన్నాయి. అటు నికర ఎన్పీఏలు సైతం 0.32% నుంచి 0.40%కి పెరిగాయి.
యాక్సిస్ బ్యాంక్ షేర్ల ధర బీఎస్ఈలో సుమారు 1.10 శాతం పెరిగి రూ. 1,534.45 వద్ద ముగిసింది.
యాక్సిస్ బ్యాంక్
Published Sat, Apr 26 2014 1:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement