భారత్‌ బెంజ్‌ వాహన ధరలు తగ్గాయ్‌ | Sakshi
Sakshi News home page

భారత్‌ బెంజ్‌ వాహన ధరలు తగ్గాయ్‌

Published Thu, Jul 13 2017 1:14 AM

BharatBenz lowers prices up to 2.5% following GST roll-out

న్యూఢిల్లీ: దైమ్లర్‌ ఇండియా కమర్షియల్‌ వెహికల్స్‌ విభాగమైన భారత్‌ బెంజ్‌ తాజాగా తన వాహన ధరలను 2.5 శాతం వరకు తగ్గించింది. జీఎస్‌టీ ప్రయోజనాలను కస్టమర్లకు అందించాలనే ఉద్దేశంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. మోడల్, ప్రాంతం ప్రాతిపదికన ధర తగ్గింపు 0.4 శాతం– 2.5 శాతం శ్రేణిలో ఉంటుందని కంపెనీ పేర్కొంది. కాగా ఇప్పటికే టాటా మోటార్స్‌తో పాటు పలు కార్ల కంపెనీలు, టూవీలర్ల సంస్థలు కూడా వాటి వాహన ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement