ఒంగోలు: బిజినెస్ చానల్ పార్టనర్స్ సహకారం వల్లే భారతీ సిమెంట్ నేడు మార్కెట్లో అగ్రగామిగా నిలిచిందని భారతీ సిమెంట్ సీనియర్ మేనేజర్ ఎంసీ మల్లారెడ్డి అన్నారు. ఒంగోలు సెంట్రల్పార్కు కాన్ఫరెన్స్హాలులో బుధవారం నిర్వహించిన బిజినెస్ చానల్ పార్టనర్స్ మీట్లో వందమందికిపైగా ఇంజినీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత భారతీ సిమెంట్ విశిష్టత, మార్కెటింగ్ తదితర అంశాలతో రూపొందించిన బుక్లెట్ను ఆవిష్కరించారు.
అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ మన్నిక, నాణ్యత, ధృఢత్వంతోపాటు కాలానుగుణంగా వస్తున్న మార్పులను తట్టుకునేలా భారతీ సిమెంట్ను తయారు చేస్తారని చెప్పారు. ఇందువల్లే 2009లో ప్రారంభించిన భారతీ సిమెంట్ నేడు పూర్తిస్థాయి మార్కెట్ ఆధిపత్యాన్ని చాటుకోవడంతోపాటు అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిందన్నారు. ఏడాదికి 5 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తిని కడప ప్లాంటులో తయారుస్తారన్నారు.
కర్నాటక జిల్లా గుల్బర్గాలో కూడా 2.75 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తిని భారతీ బ్రాండ్తోనే మార్కెట్లోకి తీసుకొస్తున్నామన్నారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన వికాట్ గ్రూపు భారతీ సిమెంట్ను భాగస్వామిగా ఎంచుకోవడంలోనే దాని గొప్పతనం ఏమిటో అందరికీ అర్థమవుతుందన్నారు. నిర్మాణరంగంలో భారతీ సిమెంట్ వినియోగంలో మెళకువలు నేర్పించడం ద్వారా తాపీ మేస్త్రీల నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నట్లు చెప్పారు. తాపీ మేస్త్రీలకు ఉచిత ప్రమాద బీమా కూడా తమ సంస్థ కల్పిస్తోందన్నారు.
అగ్రగామిగా భారతీ సిమెంట్
Published Thu, Sep 25 2014 1:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement