ట్రాయ్ చైర్మన్తో మిట్టల్ భేటీ | Sakshi
Sakshi News home page

ట్రాయ్ చైర్మన్తో మిట్టల్ భేటీ

Published Thu, Sep 22 2016 1:26 AM

ట్రాయ్ చైర్మన్తో మిట్టల్ భేటీ

న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ తాజాగా ట్రాయ్ చైర్మన్ ఆర్.ఎస్.శర్మతో సమావేశమయ్యారు. ఇందులో ఆయన జియో, ఎయిర్‌టెల్ మధ్య జరుగుతోన్న ఇంటర్‌కనెక్ట్ పాయింట్స్ వివాదంపై ట్రాయ్‌కి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం మిట్టల్ మాట్లాడుతూ.. జియోకి తగినన్ని (2,100) ఇంటర్‌కనెక్ట్ పాయింట్లను ఏర్పాటు చేశామని, వీటి సంఖ్యను మరో 1,000కి పెంచే పనిలో ఉన్నామని చెప్పారు. ‘టెస్టింగ్ ప్రక్రియ నడుస్తోంది. డిమాండ్ నోట్స్ అందాయి. అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కారమౌతాయి’ అని వివరించారు.

Advertisement
Advertisement