⇒ దేశంలో 101కి చేరిన బిలియనీర్ల సంఖ్య
⇒ శ్రీమంతులు అధికంగా ఉన్న 4వ దేశంగా భారత్
⇒ ముకేశ్ అంబానీకే అగ్రపీఠం; గ్లోబల్ లిస్ట్లో బిల్ గేట్స్ టాప్
⇒ ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితా విడుదల
న్యూయార్క్: భారత్లో 101 మంది కుబేరులున్నారు. శ్రీమంతుల సంఖ్య సెంచరీ దాటడం ఇదే తొలిసారి. వీరందరిలోకెల్లా రిలయన్స్ చీఫ్ ముకేశ్ అంబానీ టాప్లో నిలిచారు. ఈయన సంపద విలువ 23.2 బిలియన్ డాలర్లుగా ఉంది. అదే అంతర్జాతీయంగా చూస్తే ముకేశ్ అంబానీది 33వ స్థానం. ఫోర్బ్స్ ‘ప్రపంచ కుబేరులు–2017’ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా 2.043 మంది కుబేరులకు స్థానం లభించగా... ఈ సారి కూడా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్సే అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. వివరాలివీ...
⇔ జాబితాలోని 2,043 మంది శ్రీమంతుల మొత్తం సంపద విలువ 7.67 ట్రిలియన్ డాలర్లు. గతేడాదితో పోలిస్తే ఇందులో 18 శాతం వృద్ధి నమోదయింది.
⇔ జాబితాలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వరసగా నాలుగో సారి అగ్రస్థానంలో నిలవగా... ఈయన సంపద విలువ 86 బిలియన్ డాలర్లకు ఎగసింది.
⇔ గేట్స్ తర్వాతి స్థానంలో బెర్క్షైర్ హాత్వే చీఫ్ వారెన్ బఫెట్ (75.6 బిలియన్ డాలర్లు), అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ (72.8 బిలియన్ డాలర్లు) నిలిచారు.
⇔ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 3.5 బిలియన్ డాలర్లతో 544వ స్థానంలో ఉన్నారు.
⇔ కుబేరుల సంఖ్య అమెరికాలోనే ఎక్కువ. ఇక్కడ 565 మంది శ్రీమంతులున్నారు. చైనాలో 319 మంది, జర్మనీలో 114 మంది, ఇండియాలో 101 మంది బిలియనీర్లు ఉన్నారు.
⇔ జాబితాలో భారతీయ సంతతికి చెందిన వారు 20 దాకా ఉన్నారు. వీరిలో హిందూజా బ్రదర్స్ 15.4 బిలియన్ డాలర్ల సంపదతో 64వ స్థానంలో, పల్లోంజి మిస్త్రీ 14.3 బిలియన్ డాలర్ల సంపదతో 77వ స్థానంలో, ప్రకాశ్ లోహియా 5.4 బిలియన్ డాలర్ల సంపదతో 288వ స్థానంలో నిలిచారు.
⇔ ఆర్సిలర్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ 56వ స్థానంలో ఉన్నారు. ఈయన సంపద విలువ 16.4 బిలియన్ డాలర్లు.
⇔ అజీమ్ ప్రేమ్జీ, గౌతమ్ అదానీ, రాహుల్ బజాజ్, రాకేశ్ జున్జున్వాలా, ఎన్ఆర్ నారాయణ మూర్తి, నందన్ నిలేకని, ఆనంద్ మహీంద్రా వంటి భారతీయ వ్యాపారవేత్తలంతా జాబితాలో స్థానం దక్కించుకున్నారు.
⇔ అనిల్ అంబానీ 2.7 బిలియన్ డాలర్ల సంపదతో 745వ స్థానం సంపాదించారు.
⇔ పతంజలి ఆయుర్వేద్ ఎండీ ఆచార్య బాలకృష్ణ 814వ స్థానంలో ఉన్నారు. ఈయన సంపద విలువ 2.5 బిలియన్ డాలర్లు.
⇔ పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ 1.3 బిలియన్ డాలర్ల సంపదతో 1,567వ స్థానంతో ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
నలుగురు నారీమణులు
భారత్లోని 101 బిలియనీర్లలో నలుగురు మహిళలున్నారు. జిందాల్ గ్రూప్నకు చెందిన సావిత్రి జిందాల్ 303వ స్థానంలో నిలిచారు. ఈమె సంపద విలువ 5.2 బిలియన్ డాలర్లు. సావిత్రితోపాటు స్మిత కృష్ణ గోద్రేజ్ (814వ స్థానం), బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా (973వ స్థానం), యూఎస్వీ చైర్పర్సన్ లీనా తివారీ (1,030వ స్థానం) ఈ జాబితాలో ఉన్నారు.
కుబేరులు.. 100 దాటారు!
Published Wed, Mar 22 2017 1:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement