ఓఎన్‌జీసీ విదేశ్‌లో పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం | Sakshi
Sakshi News home page

ఓఎన్‌జీసీ విదేశ్‌లో పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం

Published Wed, Dec 23 2015 3:27 AM

ఓఎన్‌జీసీ విదేశ్‌లో పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం

 న్యూఢిల్లీ: అనుబంధ సంస్థ ఓఎన్‌జీసీ విదేశ్‌లో.. చమురు ఉత్పత్తి దిగ్గజం ఓఎన్‌జీసీ రూ. 5,000 కోట్లు పెట్టుబడి పెట్టే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం ‘విదేశ్’లో ప్రస్తుత రుణ మొత్తాన్ని అంతే సమానమైన ఈక్విటీ కింద ఓఎన్‌జీసీ మార్చుకోనుంది. దీంతో విదేశాల్లో ఇంధన అన్వేషణ, ఉత్పత్తి కార్యకలాపాలు మరింతగా చేపట్టేందుకు ఓఎన్‌జీసీకి వెసులుబాటు లభించగలదు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
 

Advertisement
Advertisement