హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రింటర్ల వ్యాపారంలో ఈ ఏడాది 30 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కెనాన్ ప్రకటించింది. ఈ ఏడాది దేశంలో రెండు లక్షల ప్రింటర్లు అమ్ముడవుతాయని అంచనా వేస్తుండగా అందులో కనీసం 60,000 యూనిట్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కెనాన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అలోక్ భరద్వాజ్ తెలిపారు. గతేడాది కెనాన్ మార్కెట్ వాటా 24 శాతంగా ఉంది.
ఇంక్జెట్ ప్రింటర్ల వ్యాపారంపై ప్రధానంగా దృష్టిసారించిన కెనాన్ కొత్తగా మార్కెట్లోకి తొమ్మిది ప్రింటర్లను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అలోక్ మాట్లాడుతూ ఈ ఏడాది ప్రింటర్ల ద్వారా రూ.200 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రింటర్ల వ్యాపారంలో భారీగా వృద్ధి నమోదవుతుండటంతో కొత్త ప్రింటర్లను ఇక్కడ నుంచి విడుదల చేస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్ జాతీయ విద్యా కేంద్రంగా ఎదగడంతో ప్రింటర్ల మార్కెట్కు డిమాండ్ బాగా పెరిగిందన్నారు. కెనాన్ మొత్తం వ్యాపారంలో 10 శాతం ఆదాయం ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తోందన్నారు.
రూపాయి కంటే తక్కువ
తాము అత్యాధునిక పరిజ్ఞానంతో ప్రవేశపెట్టిన ఈ ప్రింటర్ల ద్వారా రూపాయి కంటే తక్కువ రేటుకే ప్రింట్ తీసుకునే విధంగా ఈ కొత్త ప్రింటర్లను రూపొందించినట్లు తెలిపారు. గతంలో మోనో ప్రింటింగ్కి రూ.3.30 ఖర్చు అయితే ఈ ఇంక్జెట్ టెక్నాలజీ వల్ల ఆ వ్యయం 99పైసలకు తగ్గిందన్నారు. అదే కలర్ ప్రింటింగ్ రూ.5.32 నుంచి రూ.2.5కి తగ్గనున్నట్లు తెలిపారు. కొత్తగా విడుదలైన తొమ్మిదింటిలో ఆరు ప్రింటర్లు వైఫై క్లౌడ్ ఆధారంగా పనిచేస్తాయన్నారు. కొత్తగా వీటి రాకతో మొత్తం కెనాన్ పోర్ట్ఫోలియోలో ప్రింటర్ల సంఖ్య 24కి చేరింది. ఈ ఏడాది ప్రచారానికి రూ.120 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు అలోక్ తెలిపారు. అలాగే వచ్చే ఏడాదిలోగా సెక్యూరిటీ నెట్వర్క్ సర్వైవలెన్స్ కెమెరా మార్కెట్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలిపారు.
30% మార్కెట్ వాటాపై కెనాన్ దృష్టి
Published Thu, Apr 24 2014 12:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
ఎండుతున్న జలకళ
షూటింగ్... పార్టీయింగ్...
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement