హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటి వరకు లోకాస్ట్ ఫోన్ల తయారీలో పేరొందిన సెల్కాన్ ఇకనుంచి హైఎండ్ స్మార్ట్ఫోన్లపై దృష్టిసారిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా మిలీనియం సిరీస్ పేరుతో రెండు కొత్త మోడల్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మంగళవారం హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో తెలంగాణ ఐటీ మంత్రి కె.టి.రామారావు ఈ ఫోన్లను ఆవిష్కరించారు.
ఆండ్రాయిడ్ కిట్క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్, 3జీ వీడియో కాలింగ్, 9.9 మి.మీ మందంతో ఆకర్షణీయంగా క్యూ 470, క్యూ 3000 మోడల్స్ను తీర్చిదిద్దడమే కాకుండా తక్కువ ధరకే అందిస్తున్నట్లు సెల్కాన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ వై.గురు తెలిపారు. క్యూ 470 ధరను రూ.11,999, క్యూ 3000 ధర రూ. 8,999గా నిర్ణయించారు. అన్ని అప్లికేషన్లు పనిచేస్తున్నా రెండు రోజులు వచ్చే విధంగా శక్తివంతమైన 3,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు మోడల్స్ ఆన్లైన్ పోర్టల్ స్నాప్డీల్లో మాత్రమే లభించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సెల్కాన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆర్.మురళి తెలిపారు.
ఆవిష్కరణ కార్యక్రమం తర్వాత గురు మీడియాతో మాట్లాడుతూ లోఎండ్ మార్కెట్లో సెల్కాన్ బ్రాండ్ స్థిరపడటంతో ఇక నుంచి హైఎండ్ స్మార్ట్ ఫోన్లపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రానున్న రోజుల్లో రూ.5,000 నుంచి రూ.15,000 ధరల శ్రేణిలో 10 స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్నామన్నారు. ఇందులో 8 మిలీనియం, రెండు క్యాంపస్ సిరీస్లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ కొత్త మోడల్స్ను వివిధ నగరాల్లో బ్రాండ్ అంబాసిడర్ తమన్నా చేతులు మీదుగా విడుదల చేసేట్లు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు.
త్వరలోనే 4జీ సేవలు
త్వరలో తెలంగాణా రాష్ట్రంలో 4జీ సేవలు అందుబాటులోకి రానున్నట్లు కె.రామారావు ప్రకటించారు. ఈ దిశగా కంపెనీలు, ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని, దీపావళికల్లా 4జీ సేవలు అందుబాటులోకి రావచ్చన్నారు. 4జీ సేవలు అందుబాటులోకి వస్తుండటంతో ఈ విభాగంపై దృష్టిసారించాల్సిందిగా సెల్కాన్ని కోరారు. దీనిపై గురు స్పందిస్తూ సెల్కాన్తోనే 4జీ సేవలు ప్రారంభిస్తామని, దీనికి ఇప్పటి నుంచే మా ఆర్అండ్డీ బృందం పనిచేస్తుందని హామినిచ్చారు.
హైఎండ్ ఫోన్లపై సెల్ కాన్ దృష్టి
Published Wed, Jul 16 2014 3:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement