♦ స్వల్పలాభాలతో ముగింపు
♦ ఫెడ్ నిర్ణయం కోసం ఎదురుచూపు
ముంబై: భారత్ కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగరూకత వహించడంతో స్టాక్ సూచీలు పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. 150 పాయింట్ల శ్రేణిలో ఊగిసలాడిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 52 పాయింట్ల లాభంతో 31,156 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 9,580 పాయింట్ల వద్దకు క్షీణించిన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు 11 పాయింట్ల లాభంతో 9,618 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. దివాళా చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు 12 ప్రధాన ఎన్పీఏ ఖాతాలపై రిజర్వుబ్యాంక్ గుర్తించడంతో పలు బ్యాంకింగ్ షేర్లలో కనిష్టస్థాయి వద్ద కొనుగోళ్లు జరిగాయని, దాంతో మార్కెట్ ముగింపులో కోలుకున్నదని మార్కెట్ వర్గాలు తెలిపాయి. మరో వైపు టోకు ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్టస్థాయి 2.17 శాతానికి తగ్గడంతో ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయన్న విశ్లేషణలు ఉన్నాయి.
వెలుగులో రిలయన్స్...
రిలయన్స్ జియో 40 లక్షలమంది కొత్త వినియోగదారుల్ని సంపాదించుకున్నదన్న వార్తలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 3.30 శాతం ర్యాలీ జరిపి రూ. 1,357 వద్ద ముగిసింది. సెన్సెక్స్–30 షేర్లలో అత్యధికంగా లాభపడ్డ షేరు ఇదే. లార్సన్ అండ్ టుబ్రో, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ షేర్లు 1 శాతంపైగా ఎగిశాయి. సిప్లా, ఐటీసీ, ఏసీసీ, హెచ్డీఎఫ్సీ, టాటా స్టీల్లు 1–2 శాతం మధ్య క్షీణించాయి.
ప్రభుత్వ రంగ షేర్లపై ఫోకస్..: దివాళా చట్టాన్ని ప్రయోగించేందుకు 12 పెద్ద ఎన్పీఏ ఖాతాల్ని రిజర్వుబ్యాంక్ ఎంపికచేయడంతో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లపై ఇన్వెస్టర్లు దృష్టి నిలిపారు. అధికశాతం ఎన్పీఏలతో సతమతమవుతున్న పీఎస్యూ బ్యాంకులకు ఆర్బీఐ తాజా చర్య ఉపకరిస్తుందన్న అంచనాలతో కొన్ని ఎంపికచేసిన పీఎస్యూ బ్యాంకింగ్ షేర్లను ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు. దాంతో అలహాబాద్ బ్యాంక్ 7.68 శాతం ర్యాలీ జరపగా, ఆంధ్రా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్లు 4 శాతం చొప్పున పెరిగాయి. యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్లు 2 శాతం చొప్పున ఎగిశాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలు 1–2 శాతం మధ్య పెరిగాయి.
పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులు
Published Thu, Jun 15 2017 12:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement