కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిస్టింగ్‌ కార్యక్రమంలో గడ్కరీ... | Sakshi
Sakshi News home page

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిస్టింగ్‌ కార్యక్రమంలో గడ్కరీ...

Published Sat, Aug 12 2017 3:13 AM

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిస్టింగ్‌ కార్యక్రమంలో గడ్కరీ...

బీఎస్‌ఈలో శుక్రవారం కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిస్టింగ్‌ కార్యక్రమంలో  కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ పాల్గొన్నారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రహదారుల రంగంలో దాదాపు రూ.3 లక్షల కోట్ల రుణాలు ఎన్‌పీఏలుగా మారిపోకుండా ప్రయత్నించి, తమ ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. 22 క్యాబినెట్‌ నిర్ణయాలు సక్రమ అమలుతో ఇది సాధ్యపడిందని వివరించారు. 

కాగా కొచిన్‌ షిప్‌యార్డ్‌ లిస్టింగ్‌లో మెరుపులు మెరిపించింది. బీఎస్‌ఈలో రూ. 435 లిస్ట్‌ అయిన కొచిన్‌ షిప్‌యార్డ్‌ ఆ తర్వాత ఏకంగా 22 శాతం దాకా ఎగిసింది. చివరికి ఇష్యూ ధర రూ. 432తో పోలిస్తే బీఎస్‌ఈలో సుమారు 21 శాతం అధికంగా రూ. 522 వద్ద, ఎన్‌ఎస్‌ఈలో 22 శాతం పెరిగి రూ. 528 దగ్గర ముగిసింది.

Advertisement
Advertisement