- మధుమేహ ఔషధం తయారీకి రెడీ
- అతి తక్కువ ధరకే అందించేందుకు సిద్ధం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ లీ ఫార్మా మధుమేహ చికిత్సలో వాడే సాక్సాగ్లిప్టిన్ ఔషధం తయారీకై కంపల్సరీ లైసెన్సు కోసం దరఖాస్తు చేసింది. పేటెంటెడ్ డ్రగ్ అయిన సాక్సాగ్లిప్టిన్ను ఆన్గ్లైజా బ్రాండ్ పేరుతో, అలాగే మెట్ఫార్మిన్ కాంబినేషన్తో కాంబిగ్లైజ్ బ్రాండ్తో ఆస్ట్రాజెనికా భారత్లో మార్కెట్ చేస్తోంది. వాలంటరీ లెసైన్సు కోసం ఆస్ట్రాజెనికాతో గత ఎనిమిది నెలలుగా సంప్రదింపులు జరుపుతున్నట్టు లీ ఫార్మా ప్రతినిధి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. పేటెంటు యాక్టు సెక్షన్ 84 ప్రకారం కంపల్సరీ లెసైన్సు కావాలంటే ఈ ప్రక్రియ తప్పనిసరి.
ఇక సాక్సాగ్లిప్టిన్ మెరుగైన ఫలితాలను ఇస్తుందని, ఇన్సులిన్ వాడే అవసరం లేదని కంపెనీ వర్గాలు అంటున్నాయి. లీ ఫార్మాతో కలిపి ఇప్పటి వరకు భారత్లో కంపల్సరీ లెసైన్సుకు చేసుకున్న దరఖాస్తుల సంఖ్య మూడుకు చేరుకుంది. బేయర్ తయారీ క్యాన్సర్ ఔషధమైన నెక్సావర్ జనరిక్ వర్షన్ కోసం నాట్కో చేసుకున్న దరఖాస్తు మొదటిది కాగా, బ్రిస్టల్ మేయర్ స్క్విబ్ తయారీ క్యాన్సర్ మందు డసాటినిబ్ జనరిక్కై బీడీఆర్ కంపెనీ దరఖాస్తు రెండోది. నాట్కోకు మాత్రమే కంపల్సరీ లెసైన్సు దక్కింది.
అతి తక్కువ ధరలో..ఇక ఆన్గ్లైజాకు జనరిక్ వర్షన్ ఔషధాన్ని తయారు చేసేందుకు అనుమతి కోరుతూ జూన్ చివరి వారంలో లీ ఫార్మా దరఖాస్తు చేసింది. సరిపడ లభ్యత లేకపోయినా, అందుబాటు ధరలో లభించని పరిస్థితుల్లో ఔషధానికి పేటెంటు వచ్చిన మూడేళ్ల తర్వాత కంపల్సరీ లెసైన్సుకు దరఖాస్తు చేయవచ్చు. ఆస్ట్రాజెనికా భారత్లో ఆన్గ్లైజా ట్యాబ్లెట్ను రూ.41-45 మధ్య, కాంబిగ్లైజ్ను రూ.49కి విక్రయిస్తోంది. వాస్తవానికి దిగుమతి అయిన ఒక్కో ట్యాబ్లెట్కు కంపెనీకి అయిన వ్యయం 80-92 పైసలు మాత్రమే.
పేషెంటుకు నెలకు అయ్యే ఖర్చు సుమారు రూ.1,300. ఇది రోగులకు భారమేనని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. సాక్సాగ్లిప్టిన్ 2.5 ఎంజీ ట్యాబ్లెట్కు రూ.27, 5 ఎంజీ ట్యాబ్లెట్ను రూ.29లకే అందించాలని లీ ఫార్మా నిర్ణయించింది. అలాగే సాక్సాగ్లిప్టిన్, మెట్ఫార్మిన్ కాంబినేషన్ డ్రగ్ను దాని సామర్థ్యాన్నిబట్టి రూ.30-31.50లకే ఆఫర్ చేస్తోంది. ఆస్ట్రాజెనికాకు చెల్లించాల్సిన రాయల్టీతో కలుపుకుని ఈ ధరలను నిర్ణయించింది.
కంపల్సరీ లెసైన్సుకు దరఖాస్తు చేసిన లీ ఫార్మా
Published Sat, Jul 11 2015 12:59 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
పీఆర్సీ వేతన సవరణ అంశాలపై వివరణ
ఇండియా కూటమిని గెలిపించాలి
వారికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం..
ఎన్నికలప్పుడే గుర్తొస్తాయి!
ఓటర్లకు అందుబాటులో ‘చాట్బాట్’ యాప్
హజ్ యాత్రికులకు నేడు వ్యాక్సినేషన్
రోడ్డు ప్రమాదంలో పీఎస్ మృతి
అక్రమ మద్యం అమ్ముతున్న ఇద్దరి అరెస్టు
No Headline
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement