సాక్షి, హైదరాబాద్: ఈ మధ్య కాలంలో నగరంలోని నిర్మాణ సంస్థలు రకరకాల ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. మరి, ఈ ఆఫర్లు నిజంగా స్థిరాస్తి కొనుగోలుదారులకు లాభసాటేనా? అసలు ప్రాజెక్ట్ కొనగానే సాఫ్ట్ లాంచ్లోనో.. ప్రీ లాంచ్లోనో కొంటే లాభముంటుందా? వంటి సందేహాలు సహజం.
♦ ప్రాజెక్ట్ ప్రారంభించగానే కొనుగోలు చేస్తే కొంత వరకు లాభముంటుందని నిపుణులంటున్నారు. ఎలాగంటే ఓ కంపెనీ ధర చ.అ.కు రూ. 3,000 చొప్పున అమ్మకాలు మొదలెట్టింది.. అదే సంస్థ సాఫ్ట్ లాంచ్, ప్రీ లాంచ్ పేరిట అమ్మకాలు చేపట్టినప్పుడు చ.అ.కు రూ. 2,800కే ఇవ్వొచ్చు. ఇంకా తక్కువకు విక్రయించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ఇప్పుడు ధైర్యంగా అడుగు ముందుకేస్తే ప్రాజెక్టు ప్రారంభమయ్యేనాటికి ఫ్లాట్ రేటు పెరగడానికి ఆస్కారముంటుందని నిపుణులు వివరిస్తున్నారు.
♦ ప్రాజెక్ట్ లేదా వెంచర్ ఏదైనా సరే మీరు మొదటి కస్టమరైతే కొత్త అల్లుడికి ఇచ్చినంత మర్యాద ఇస్తారు. ఫ్లాట్లోని ప్రత్యేకతలు, వసతులూ నచ్చకపోతే మార్పులు చేయమంటే కూడా చేసిస్తారు. అంటే మీకు విట్రిఫైడ్ టైల్స్ ఇష్టమనుకోండి.. మార్బుల్ వేస్తామన్న కంపెనీ మీ డిమాండ్కు దిగివస్తుంది. ఇంటీరియర్ డిజైనింగ్ విషయంలో మార్పులున్నా చేసి పెడతారు. నాణ్యత విషయంలో రాజీపడరు. ప్రాజెక్టు ఆరంభంలోనే ప్రతికూల ప్రచారాన్ని ఏ కంపెనీ కూడా కోరుకోదు కాబట్టి.. అందుకే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాయి.
♦ అయితే ధర తక్కువగా ఉందని తొందరపడి మాత్రం స్థిరాస్తిని కొనుగోలు చేయరాదని నిపుణులు సూచిస్తున్నారు. మంచి రికార్డు, దీర్ఘకాలిక చరిత్ర, ఆర్థిక స్థోమత ఉన్న కంపెనీల ఆఫర్లనే ఎంచుకోవాలి. అలాగే కొనుగోలు చేయబోయే ప్రాజెక్ట్కు అనుమతి ఉందా? ఆ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం ఉందా? మళ్లీ అమ్మకానికి పెడితే రీసేల్ అవుతుందా? వంటి అంశాల్ని గమనించాలి.
సంస్థలకూ లాభమే..
ముందస్తు కొనుగోళ్లు కస్టమర్లకే కాదు నిర్మాణ సంస్థలకూ లాభమే. అనుమతులు రాక ముందే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించవు. తప్పనిసరి పరిస్థితుల్లో బిల్డర్ బయటి వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. మరి ఈ ఇబ్బందిని అధిగమించడానికి ముందస్తు అమ్మకాలు కలిసొస్తాయి. అయితే ఇది కేవలం నిర్మాణ సంస్థకు మార్కెట్లో ఉన్న పేరు ప్రఖ్యాతులపైనే ఆధారపడుతుంది సుమి.
రాయితీలు లాభమేనా?
Published Sat, Jan 7 2017 12:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement