న్యూయార్క్: ఐటీ రంగంలో అత్యంత భారీ డీల్కు తెరతీసింది టెక్నాలజీ దిగ్గజం డెల్. ఏకంగా 67 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 4,35,000 కోట్లు) వెచ్చించి ఈఎంసీ కార్పొరేషన్ను కొనుగోలు చేయనుంది. తద్వారా ప్రైవేట్ వ్యక్తి సారథ్యంలో అతి పెద్ద టెక్నాలజీ కంపెనీగా ఆవిర్భవించనుంది. ఒప్పందం ప్రకారం డెల్, దాని వ్యవస్థాపక చైర్మన్ మైఖేల్ ఎస్ డెల్, సిల్వర్ లేక్ కలిసి ఈఎంసీని కొనుగోలు చేస్తాయి.
ఈఎంసీ డెరైక్టర్ల బోర్డు ఈ డీల్కు ఆమోదముద్ర వేసి, షేర్హోల్డర్లకు సిఫార్సు చేసింది. ఈఎంసీ షేర్హోల్డర్లకు షేరు ఒక్కింటికి 33.15 డాలర్లు విలువ లభిస్తుందని, డీల్ మొత్తం విలువ దాదాపు 67 బిలియన్ డాలర్లు ఉంటుందని డెల్ తెలిపింది. ఈఎంసీ కీలక అనుబంధ సంస్థ వీఎంవేర్ షేరు ధర ప్రాతిపదికన ఒప్పంద విలువను నిర్ధారించారు. ఇందుకు అక్టోబర్ 7న వీఎంవేర్ షేరు ధర 81.78 డాలర్లను పరిగణనలోకి తీసుకున్నారు.
ఒప్పంద నిబంధనల ప్రకారం ఈఎంసీ షేర్హోల్డర్లకు 24.05 డాలర్ల మేర నగదు రూపంలోనూ, మిగతాది వీఎంవేర్లో ఈఎంసీ పెట్టుబడుల మేరకు స్టాక్స్ రూపంలో లభిస్తుందని డెల్ పేర్కొంది. దాదాపు 2 లక్షల కోట్ల డాలర్ల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మార్కెట్లో కీలక విభాగాల్లో దిగ్గజంగా ఎదిగేందుకు ఈ ఒప్పందం తోడ్పడగలదని డెల్ చైర్మన్ మైఖేల్ డెల్ తెలిపారు. డేటా సెంటర్, హైబ్రిడ్ క్లౌడ్, మొబైల్, సెక్యూరిటీ తదితర వ్యూహాత్మక విభాగాల్లో భారీ వృద్ధి సాధించగలమని ఈఎంసీ చైర్మన్ జో టుషి పేర్కొన్నారు. ఇటు కస్టమర్లకు, ఉద్యోగులకు, భాగస్వాములకు, షేర్హోల్డర్లకు ఈఎంసీ, డెల్ కలయిక ప్రయోజనం చేకూర్చగలదని జో తెలిపారు.
డెల్ చేతికి ఈఎంసీ కార్పొరేషన్
Published Tue, Oct 13 2015 12:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement