• ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ సంకేతాలు
• పెద్ద నోట్ల రద్దుతో పన్నుల ఆదాయం పెరుగుతుంది
• లెక్కలు చూపని డిపాజిట్లపై పన్ను వసూలు చేస్తామని వెల్లడి
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అని త్వరలో పన్ను రేట్లు దిగిరానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం సంకేతాలు ఇచ్చారు. డీమోనిటైజేషన్ కారణంగా లెక్కల్లో చూపని సంపద నుంచి అధిక మొత్తంలో పన్ను ఆదాయం వ్యవస్థలోకి వస్తే భవిష్యత్తులో ప్రత్యక్ష, పరోక్ష రేట్లు తక్కువ స్థాయికి దిగివస్తాయన్నారు. అనైతిక చర్యలకు పాల్పడేవారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అక్రమంగా భారీ మొత్తాల్లో నగదు సమకూర్చుకుంటే అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, నిఘా సంస్థలు వారిపై కన్నేసి ఉంచాయన్నారు. బ్యాంకు అధికారుల సహకారంతో కొందరు భారీ మొత్తాల్లో పాత నోట్లను కొత్త నోట్లతో మార్చుకుంటున్న నేపథ్యంలో జైట్లీ ఈ విధంగా స్పందించారు. ఈ విధమైన చర్యలు చట్టాన్ని ఉల్లంఘించడమేనని, ఆర్థిక రంగానికి నష్టం చేకూరుస్తాయన్నారు.
డిజిటల్ యుగంలోకి...: ‘‘వ్యవస్థలో చెలామణిలో ఉన్న నగదు చాలా వరకు నేడు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చింది. ఈ డిపాజిట్లు అన్నింటినీ లెక్కించాల్సి ఉంది. పన్నులు చెల్లించని నగదు ఉంటే వాటిపై పన్ను వసూలు చేస్తాం’’ అని జైట్లీ వివరించారు. భవిష్యత్తు లావాదేవీలన్నీ డిజిటల్ ఆధారితమేనని, నగదు రహిత సమాజం దిశగా దేశం అడుగులు వేస్తోందన్నారు. ‘‘ఒక్కసారి ఈ మొత్తం డిజిటల్గా మారితే పన్ను వలలో చిక్కుకున్నట్టే. ఫలితంగా ఇప్పటి కంటే భవిష్యత్తులో పన్ను ఆదాయం మరింత పెరుగుతుంది.
దీంతో పన్ను రేట్లను మరింత సహేతుక స్థాయిలో ఉంచేందుకు ప్రభుత్వానికి అవకాశం చిక్కుతుంది. ఇది ప్రత్యక్ష, పరోక్ష పన్ను రేట్లకూ వర్తిస్తుంది’’అని జైట్లీ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుకు తోడు జీఎస్టీ అమలు వంటి సంస్కరణలు, నగదు వినియోగంపై పాన్ నంబర్ చూపాలనే ఆంక్షలతో అవినీతి తగ్గుముఖం పడుతుందన్నారు. నగదు వినియోగం తగ్గిస్తే, పన్ను ఎగవేతలు కూడా తగ్గుముఖం పడతాయని చెప్పారు.
పన్ను రేట్లు దిగివస్తాయ్!
Published Wed, Dec 14 2016 1:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement