మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం...
న్యూఢిల్లీ: పెట్టుబడుల ఉపసంహరణలకు (డిజిన్వెస్ట్మెంట్) సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) లక్ష్యాన్ని కుదించే అంశాన్ని కేంద్రం యోచిస్తున్నట్లు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పెట్టుబడుల ఉపసంహరణల బడ్జెట్ లక్ష్యం రూ.69,500 కోట్లు. ప్రభుత్వ రంగ సంస్థల్లో మైనారిటీ వాటా విక్రయం ద్వారా విక్రయించాలని భావిస్తున్న మొత్తం ఇందులో రూ.41,000 కోట్లు. మిగిలిన రూ. 28,500 కోట్లు వ్యూహాత్మక వాటా విక్రయం ద్వారా సేకరించాలని ప్రతిపాదించారు. అయితే ఈ మొత్తం లక్ష్యాన్ని సగానికి కన్నా ఎక్కువగా రూ.30,000 కోట్లకు తగ్గించాలని డిజిన్వెస్ట్మెంట్ శాఖ భావిస్తున్నటు సమాచారం. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు దీనికి కారణం.
ఇప్పటివరకూ ఇలా...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికి ఏడు నెలలు గడిచిపోతున్నాయి. అయితే ఇప్పటివరకూ కేవలం నాలుగు కంపెనీల ద్వారా మాత్రమే కేంద్రం వాటాలు విక్రయించింది. పీఎఫ్సీ, ఆర్ఈసీ, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, ఐఓసీల నుంచి జరిగిన ఈ వాటాల విక్రయం ద్వారా ప్రభుత్వం రూ. 12,600 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. 2015-16 లక్ష్యాల ప్రకారం... 20 ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు కేబినెట్ ఆమోదం ఉంది.
వీటిలో ఓఐఎల్, నాల్కో, ఎన్ఎండీసీ, కోల్ ఇండియా (10 శాతం చొప్పున), ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, బీహెచ్ఈఎల్ (5 శాతం చొప్పున)లు ఉన్నాయి. ఇటీవలి ఐఓసీ, పీఎఫ్సీ డిజిన్వెస్ట్మెంట్ల విషయంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాయి. గత ఐదేళ్లుగా బడ్జెట్ నిర్దేశిస్తున్న స్థాయిల్లో పెట్టుబడుల ఉపసంహరణల లక్ష్యం నెరవేరకపోవడం గమనార్హం.
డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం కుదింపు?
Published Tue, Oct 27 2015 1:10 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఓ మదీ మేలుకో..!
‘ఎన్నికల సమయంలో డ్యూటీ పీరియడ్గా పరిగణించాలి’
స్ట్రాంగ్ రూమ్లు పరిశీలించిన ఎస్పీ
లూజు పెట్రోల్ విక్రయించరాదు
24న ఎచ్చెర్ల ఐటీఐలో జాబ్ మేళా
మల్లేష్కు కన్నీటి వీడ్కోలు
తగ్గని ఎన్నికల వేడి
మహేంద్రతనయలో పడి యువకుడి మృతి
ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షకు 97 మంది గైర్హాజరు
ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య
తప్పక చదవండి
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- ఓ మదీ మేలుకో..!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement