* చివర్లో సూచీలు డౌన్
* నెలరోజుల కనిష్టస్థాయి
ముంబై: బిహార్ ఎన్నికల ఫలితాల పట్ల ఇన్వెస్టర్లు అయోమయంలో పడటంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనయ్యింది. వివిధ ఎగ్జిట్ పోల్స్ విభిన్నంగా వుండటంతో కనిష్టస్థాయి వద్ద కొనుగోళ్లు, గరిష్టస్థాయి వద్ద అమ్మకాలు జరిగాయి. దాంతో రోజంతా సూచీలు ఎగుడుదిగుడులకు లోనయ్యాయి.
26,439-26,190 పాయింట్ల మధ్య ఊగిసలాడిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 39 పాయింట్ల నష్టంతో 26,265 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 8,003-7,926 పాయింట్ల గరిష్ట, కనిష్టస్థాయిల మధ్య కదలాడి, చివరకు 1 పాయింటు స్వల్పనష్టంతో 7,954 పాయింట్ల వద్ద ముగిసింది. సూచీలకు ఇది నెలరోజుల కనిష్టస్థాయి.
గత 10 ట్రేడింగ్ సెషన్లలో భారత్ సూచీలు క్షీణించడం ఇది తొమ్మిదవసారి. బిహార్ ఎన్నికలలో స్పష్టమైన విజేత ఎవరో ఎగ్జిట్ పోల్స్ తేల్చకపోవడంతో మార్కెట్లో తీవ్ర హెచ్చుతగ్గులు నెలకొన్నాయని బీఎన్పీ పారిబాస్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ శ్రేయాష్ దేవాల్కర్ చెప్పారు. వెలుగులో పీఎస్యూ బ్యాంకులు
సూచీలు చివరకు నష్టాల్లో ముగిసినా, మార్కెట్ వేళల్లో ఆర్థిక ఫలితాలు వెల్లడించిన మూడు పీఎస్యూ బ్యాంక్ షేర్లు భారీ ట్రేడింగ్ పరిమాణంతో ర్యాలీ జరిపాయి.
బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాల్ని మించిన ఫలితాలు వెల్లడించడంతో 3.86 శాతం ఎగిసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా నికరలాభం అనూహ్యంగా క్షీణించడంతో ట్రేడింగ్ తొలిదశలో 10 శాతంపైగా నష్టపోయింది. దాదాపు ఏడాది కనిష్టస్థాయి అయిన రూ. 140 వద్ద ఆ షేరుకు భారీ కొనుగోలు మద్దతు లభించడంతో ఆ స్థాయి నుంచి వేగంగా 15 శాతంవరకూ ర్యాలీ జరిపి రూ. 168 స్థాయికి పెరిగింది. మరో ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫలితాలు అంచనాలకంటే మెరుగ్గా వుండటంతో 2.5 శాతం పెరిగింది. ఓరియంటల్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు కూడా 2-3 శాతం పెరిగాయి.
బిహార్ డైలమా-హెచ్చుతగ్గుల మార్కెట్
Published Sat, Nov 7 2015 1:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement