చిన్న సంస్థలకు ఈపీఎఫ్‌వో ఊరట... | Sakshi
Sakshi News home page

చిన్న సంస్థలకు ఈపీఎఫ్‌వో ఊరట...

Published Thu, Jun 25 2015 12:02 AM

Epfo relief to small firms ...

న్యూఢిల్లీ : ఉద్యోగుల భవిష్య నిధికి తమ వంతుగా కట్టాల్సిన మొత్తాన్ని జమ చేసే విధానం విషయంలో చిన్న సంస్థలకు ఈపీఎఫ్‌వో కొంత వెసులుబాటు కల్పించింది. ఇంతకు ముందు లాగానే సుమారు రూ. 1లక్ష కన్నా తక్కువగా జమ చేయాల్సిన మొత్తాన్ని చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్‌ల ద్వారా చెల్లించడానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ దాకా ఈ వెసులుబాటు ఉంటుంది. ఆ తర్వాత నుంచి మాత్రం ఆయా కంపెనీలు ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే జమ చేయాల్సి ఉంటుందని ఈపీఎఫ్‌వో పేర్కొంది.

Advertisement
Advertisement