114 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- లాభాల స్వీకరణ మరో కారణం
- నిఫ్టీ నష్టం 37 పాయింట్లు
- 8,700 దిగువకు నిఫ్టీ
- మార్కెట్ అప్డేట్
వడ్డీరేట్లపై ఫెడ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఇన్వెస్టర్ల ముందు జాగ్రత్త కారణంగా స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాలపాలయింది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచితే భారత్ వంటి వర్థమాన దేశాల నుంచి నిధులు తరలివెళతాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) అధినేత క్రిస్టిన్ లగార్డే వ్యాఖ్యలు ప్రతికూల ప్రభావం చూపాయి. భారత్ కాలమాన ప్రకారం బుధవారం అర్థరాత్రి ఫెడ్ నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో ముందుజాగ్రత్తగా ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు దిగారు.
దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 114 పాయింట్లు, నిఫ్టీ 37పాయింట్లు చొప్పున నష్టపోయాయి. నిఫ్టీ 8,700 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్లో స్టాక్ మార్కెట్ సూచీలు 0.4 శాతం చొప్పున క్షీణించాయి. ఎఫ్ఎంసీజీ, మౌలిక, టెక్నాలజీ, కొన్ని ఎంపిక చేసిన వాహన షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.
బుధవారం నాటి ముగింపు(28,736 పాయింట్లు)తో పోల్చితే బీఎస్ఈ సెన్సెక్స్ 31 పాయింట్ల లాభంతో 28,767 వద్ద ప్రారంభమైంది. విదేశీ నిధుల వరదతో పటిష్టమైన కొనుగోళ్ల కారణంగా 28,807 పాయింట్ల గరిష్ట స్థాయికి (71 పాయింట్లు లాభం)ఎగసింది. ఆ తర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో 28,547(189 పాయింట్లు నష్టం) పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇక నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 8,686 పాయింట్ల వద్ద ముగిసింది.
3 శాతం నష్టపోయిన ఎన్టీపీసీ
30 సెన్సెక్స్ షేర్లలో 18 షేర్లు నష్టాల్లో, 12 షేర్లు లాభాల్లో ముగిశాయి. 10 శాతం వాటాను ప్రభుత్వం విక్రయించనున్నదన్న వార్తలతో ఎన్టీపీసీ 3 శాతం పతనమైంది. గత నెలలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ హోల్సేల్ విక్రయాలు 1 శాతం తగ్గడంతో టాటా మోటార్స్ 2 శాతం తగ్గింది. రూపాయి బలపడడంతో ఐటీ షేర్లు పతనమయ్యాయి. 1,585 షేర్లు నష్టాల్లో, 1,262 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ ఎన్ఎస్ఈలో రూ.18,204 కోట్లుగా, డెరివేటివ్స్ విభాగంలో రూ.2,32,303 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.457 కోట్లు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.883 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. సింగపూర్, దక్షిణ కొరియాలు మినహా మిగిలిన అన్ని ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
మార్కెట్ల నుంచి నిధుల సమీకరణకు వీలు కల్పించండి సెబీకి ఈకామర్స్ కంపెనీల వినతి పెద్ద సంఖ్యలో వస్తున్న ఈకామర్స్ కంపెనీలు, స్టార్టప్ సంస్థలు నిధుల సమీకరణ కోసం క్యాపిటల్ మార్కెట్ల బాట పట్టాలని యోచి స్తున్నాయి. ఇందుకోసం ఐపీవో నిబంధనలు సడలించాలంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీని కోరుతున్నాయి. దీనికి సంబంధించి ఇటీవలే పలువురు పరిశ్రమ ప్రముఖులు, వెంచర్ క్యాపిటలిస్టులు .. సెబీ చైర్మన్ యూకే సిన్హాను, ఇతర ఉన్నతి అధికారులను కలిశారు.
సెబీ ససేమిరా..!
కాగా ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సెబీ మాత్రం ఈకామర్స్ కంపెనీల కోసం ఐపీవో నిబంధనల సడలింపుపై అంత సానుకూలంగా లేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఫెడ్ ప్రకటనపై ముందు జాగ్రత్త
Published Thu, Mar 19 2015 1:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్బరేలీలో రాహుల్కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement