♦ 25–26 తేదీల్లో ఫెడరల్ రిజర్వ్ భేటీ
♦ 27న డెరివేటివ్స్ ముగింపు
♦ కంపెనీల ఫలితాలు,లిక్విడిటీ కీలకం
♦ స్టాక్ వారీ కదలికలు, కన్సాలిడేషన్కు అవకాశం
♦ ప్రతికూలతలు లేకుంటే ముందుకే
♦ విశ్లేషకుల అంచనాలు
న్యూఢిల్లీ: ఈ వారం పలు కీలక అంశాలకు వేదిక కానుంది. వడ్డీ రేట్లకు సంబంధించి అమెరికా ఫెడ్ సమావేశం బుధవారం జరగనుండగా, జూలై నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులకు గురువారంతో గడువు తీరిపోనుంది. వీటితోపాటు బ్లూచిప్ కంపెనీల ఫలితాలు మార్కెట్ గమనాన్ని నిర్ణయించనున్నాయని నిపుణులు అంటున్నారు. అధిక వోలటాలిటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. బ్లూచిప్ కంపెనీల ఫలితాలు, వచ్చే నెల ఫ్యూచర్స్కు రోలోవర్ ఏ మేర ఉంటుందన్నవి మార్కెట్ సెంటిమెంట్ను నిర్ణయించే అంశాలుగా ట్రేడ్స్మార్ట్ ఆన్లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అభిప్రాయపడ్డారు.
బుధవారం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తన నిర్ణయాన్ని ప్రకటించనుందని చెప్పారు. ఈ వారంలో ఐసీఐసీఐ బ్యాంకు, మారుతి, ఓఎన్జీసీ, హీరోమోటో కార్ప్, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, యాక్సిక్ బ్యాంకు, తదితర బ్లూచిప్ కంపెనీలు జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. కీలక అంశాల నేపథ్యంలో మార్కెట్లలో అధిక అస్థిరత ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. జూన్ క్వార్టర్ ఫలితాల నేపథ్యంలో మార్కెట్ కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ స్ట్రాటజిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాలు అంత ఆశాజనకంగా ఏమీ లేవన్నారు.
తేడా వస్తే రివర్స్
‘‘అధిక లిక్విడిటీకితోడు ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాలతో మార్కెట్లు అధిక స్థాయికి చేరాయి. అధిక స్థాయిల దిశగా సెంటిమెంట్ నెలకొని ఉంది. అదే సమయంలో ఉన్నట్టుండి మార్కెట్లు తిరుగుముఖం పట్టే రిస్క్ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఏవైనా ప్రతికూల పరిణామాలు ఎదురైతే అది మన మార్కెట్లపై పడుతుంది’’ అని శామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమీద్ మోదీ చెప్పారు. 25–26 నాటి ఫెడ్ సమావేశం నుంచి ఏవైనా ఊహించని నిర్ణయాలు వెలువడతాయా అన్న ఆసక్తి నెలకొందన్నారు. ఈ నేపథ్యంలో స్టాక్ వారీగా కదలికలతోపాటు మార్కెట్లలో కన్సాలిడేషన్ ఉంటుందని అధిక శాతం విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ వారం రిజల్ట్స్
సోమవారం (24న) హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్, అంబుజా సిమెంట్స్ ఫలితాలను వెల్లడించనున్నాయి. 25న భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, ఏషియన్ పెయింట్స్ కంపెనీలు... ఈ నెల 26న యస్ బ్యాంక్, 27న డాక్టర్ రెడ్డీస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, మారుతీ సుజుకీ కంపెనీలు, 28న ఎల్ అండ్ టీ కంపెనీలు జూన్ త్రైమాసికపు ఫలితాలను ప్రకటిస్తాయి. అంతర్జాతీయ అంశాల పరంగా చూస్తే సోమవారం జపాన్, అమెరికా తయారీ రంగాల పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) గణాంకాలు వెలువడనున్నాయి. 26న అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోనుండగా, ఈ వారంలోనే చమురు ఉత్పాదక దేశాల సమాఖ్య ఓపెక్ సమావేశం కూడా జరగనున్నది.
జూలైలో విదేశీ ఇన్వెస్టర్ల దూకుడు
దేశీయ మార్కెట్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐ) దూకుడు కొనసాగుతోంది. క్యాపిటల్ మార్కెట్లలో జూలైలో 2.4 బిలియన్డాలర్ల (రూ.15,348 కోట్ల మేర) పెట్టుబడులు పెట్టారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు విదేశీయులు చేసిన పెట్టుబడులు 25 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1,60,000 కోట్లు) దాటేశాయి. జనవరి నెలలో రూ.3,496 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్న తర్వాత నుంచి ఎఫ్పీఐలు దేశీయ మార్కెట్ల పట్ల సానుకూలంగానే కొనసాగుతున్నారు. తాజా గణాంకాల ప్రకారం జూలై 3–21 తేదీల మధ్య ఎఫ్పీఐలు నికరంగా రూ.2,977 కోట్ల మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, డెట్ మార్కెట్లో రూ.12,371 కోట్ల పెట్టుబడులు పెట్టారు.
మార్కెట్లకు ‘ఫెడ్’ డైరెక్షన్
Published Mon, Jul 24 2017 12:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ఫిల్ సాల్ట్ విధ్వంసం.. ఢిల్లీను చిత్తు చేసిన కేకేఆర్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement