ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ఈ నెల 6–7 తేదీల్లో జరిపిన కీలక పరపతి సమీక్షలో దేశంలో ప్రస్తుత వృద్ధి, ద్రవ్యోల్బణంపైనే ప్రధాన చర్చ జరిగింది. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు కనబడుతున్నా, ఇప్పుడే ప్రారంభమైన ఆర్థిక రికవరీల నేపథ్యంలో ప్రస్తుతానికి రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణంపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6 శాతం) యథాతథంగా కొనసాగించడమే మంచిదన్న అంశానికి మెజారిటీ సభ్యుల మద్దతు లభించింది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీలో ఐదుగురు రేటు యథాతథ స్థితికి మద్దతు పలుకగా, ఒక్క ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ దేబబ్రత మాత్రం పావుశాతం రేటు పెంపునకు ఓటు చేశారు. పొంచిఉన్న ద్రవ్యోల్బణం సవాలును దీనికి ఆయన కారణంగా చూపారు. రేటు యథాతథ స్థితి 6 నెలల్లో ఇది వరుసగా మూడోసారి.
వచ్చే సమావేశంలోనూ రేటు యథాతథమే?
ద్రవ్యోల్బణం పెరిగేతే... రేటు పెంపు ఖాయమన్న సంకేతాలను ఫిబ్రవరి 6–7 పాలసీ సమావేశం ఇచ్చిందనే భావించవచ్చు. అయితే ఈ సమావేశం తరువాత, జనవరికి సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు ఫిబ్రవరి 12వ తేదీన, టోకు ద్రవ్యోల్బణానికి సంబంధించి జనవరి గణాంకాలు 15న వెలువడ్డాయి. టోకు ద్రవ్యోల్బణం ఈ నెలలో ఆరు నెలల కనిష్ట స్థాయిలో 2.84 శాతంగా నమోదయ్యింది. రిటైల్ ద్రవ్యోల్బణం 5.07 శాతంగా నమోదయ్యింది. డిసెంబర్లో ఈ రేటు 17 నెలల గరిష్ట స్థాయిలో 5.21 శాతంగా ఉంది. ఇదే తీరున ద్రవ్యోల్బణం అదుపులో ఉంటే, వృద్దికి ఎటువంటి విఘాతం కలగకుండా ఏప్రిల్ జరిగే పరపతి సమీక్షలో కూడా రెపో రేటును యథాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. ప్లస్ 2, మైసస్ 2తో ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద కట్టడి చేయాలన్నది ఆర్బీఐ లక్ష్యం.
వృద్ధి రేటు, ద్రవ్యోల్బణంపైనే దృష్టి
Published Thu, Feb 22 2018 12:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
టుడేస్ లీడర్: రోజా హ్యాట్రిక్! వన్స్ మోర్ జగన్
ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ దూరం.. బాబు కుట్రకు పురంధేశ్వరి బలి
టీ20 వరల్డ్కప్కు నేపాల్ జట్టు ప్రకటన..
ఈసీ నిషేధంపై స్పందించిన కేసీఆర్
చిన్న విషయానికి చిల్లర గొడవ.. కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు
వీళ్లే మన ఏలూరు అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి..
గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి నా విజ్ఞప్తి: సీఎం జగన్
కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
గెలుపు ధీమా.. జోరుగా హుషారుగా ఎన్నికల ప్రచారం
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement