ఐటీ కంపెనీల కొనుగోలు కోసం ఎస్‌ఎన్‌ఎస్‌కే | Sakshi
Sakshi News home page

ఐటీ కంపెనీల కొనుగోలు కోసం ఎస్‌ఎన్‌ఎస్‌కే

Published Mon, Sep 14 2015 11:51 PM

ఐటీ కంపెనీల కొనుగోలు కోసం ఎస్‌ఎన్‌ఎస్‌కే

న్యూఢిల్లీ: హెచ్‌సీఎల్ టెక్నాలజీ చైర్మన్, వ్యవస్థాపకుల్లో ఒకరైన శివ్‌నాడార్, టెక్నాలజీ రంగంలో ప్రసిద్ధ నిపుణుడు సంజయ్ కల్రాతో కలిసి ఒక ఇన్వెస్ట్‌మెంట్‌ను కంపెనీను ప్రారంభించనున్నారు. శివ్ నాడార్ అండ్ సంజయ్ కల్రా (ఎస్‌ఎన్‌ఎస్‌కే) అసోసియేట్స్ ఎల్‌ఎల్‌పీ పేరుతో  ఏర్పాటైన ఈ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలో వీరిరువురు 50 కోట్ల డాలర్లు(రూ.3,316 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నారు.ఈ సంస్థ అమెరికా, భారత్‌కు చెందిన ఐటీ ప్రొడక్ట్, ప్లాట్‌ఫామ్ కంపెనీలను కొనుగోలు చేయనున్నది.

Advertisement

తప్పక చదవండి

Advertisement