అరకు కాఫీ కొనుగోలుకు ఒప్పందం
* నెలాఖరుకు కుదిరే అవకాశం
* ఏటా రూ.కోటి వ్యాపారం
సాక్షి, విశాఖపట్నం: గిరిజన సహకార సంస్థ (జీసీసీ) మరో ముందడుగు వేయబోతోంది. ప్రపంచ ప్రఖ్యాత వాల్మార్ట్ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకోనుంది. రుచిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అరకు కాఫీ కొనుగోలుకు వాల్మార్ట్ ఆసక్తిగా ఉంది. గత డిసెంబర్ 13న అరకు కాఫీ మార్కెట్లోకి విడుదలైంది. ఆ తర్వాత జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు, అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్)లలో అరకు కాఫీకి ప్రాచుర్యం లభించింది.
సీఐఐ అంతర్జాతీయ సదస్సులో జీసీసీ అరకు కాఫీ స్టాల్ను ఏర్పాటు చేసింది. సదస్సుకు వచ్చిన ముఖ్యమంత్రితో పాటు విదేశీ ప్రతినిధులు ఈ కాఫీ రుచి చూశారు. ఫిబ్రవరిలో జరిగిన ఐఎఫ్ఆర్కూ ఏయూ ఇంజినీరింగ్ మైదానంలో ఏర్పాటు చేసిన ఐఎఫ్ఆర్ విలేజిలో జీసీసీకి స్టాల్ కేటాయించారు. అందులో అరకు కాఫీని సేవించిన ప్రధాని నరేంద్రమోదీ క్యా టేస్ట్హై అంటూ మెచ్చుకున్నారు. ఐఎఫ్ఆర్ జరిగిన నాలుగు రోజుల్లోనూ సుమారు పది వేల కాఫీలు అమ్ముడయ్యాయి. ఇలా సీఐఐ సదస్సు, ఐఎఫ్ఆర్ల్లో రూ.20 లక్షల విలువైన కాఫీ పొడి, రూ.5 లక్షల విలువైన లిక్విడ్ కాఫీ అమ్మకాలు విశాఖలోనే జరిగాయి. మరోవైపు ఆన్లైన్ మార్కెట్లోనూ అరకు కాఫీ అందుబాటులో ఉంది.
గిఫ్ట్ ప్యాక్లుగా..: అరకు కాఫీ.. గిఫ్ట్ ప్యాక్ల రూపంలోనూ ప్రముఖులకు అందజేస్తున్నారు. ఇటీవల విశాఖ వచ్చిన కేంద్ర హోంశాఖమంత్రి రాజ్నాథ్సింగ్, కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్లతో పాటు ఆయనతో వచ్చిన అమెరికా ప్రతినిధి బృందానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టక్కర్, బొబ్బిలి వీణతో కలిపి అరకు కాఫీని గిఫ్ట్ ప్యాకెట్లుగా ఇచ్చారు.
నెలాఖరుకల్లా ఎంవోయూ
ఇటీవల వాల్మార్ట్ వైస్ ప్రెసిడెంట్ రజనీష్ కుమార్తో జీసీసీ చర్చలు జరిపింది. కొద్దిరోజుల క్రితం వాల్మార్ట్ సంస్థ క్వాలిటీ కంట్రోల్ బృందం వచ్చి కాఫీ నాణ్యతను పరిశీలించి వెళ్లింది. నెలాఖరు నాటికి వాల్మార్ట్తో ఎంవోయూ కుదరవచ్చని జీసీసీ ఎండీ ఏఎస్పీఎస్ రవిప్రకాష్ ‘సాక్షి’కి చెప్పారు. వాల్మార్ట్కు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఔట్లెట్లు ఉన్నాయన్నారు. వాల్మార్ట్కు ఏటా రూ.కోటి రూపాయల విలువైన అరకు కాఫీని సరఫరా చేసే అవకాశం ఉందని, డిమాం డ్ను బట్టి మరింత పెంచుతామని తెలిపారు.
జీసీసీతో వాల్మార్ట్ ఎంవోయూ
Published Mon, Mar 7 2016 12:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement