జియోనీ నుంచి ‘ఎం5 ప్లస్’ స్మార్ట్ఫోన్ | Sakshi
Sakshi News home page

జియోనీ నుంచి ‘ఎం5 ప్లస్’ స్మార్ట్ఫోన్

Published Tue, Jun 7 2016 1:08 AM

జియోనీ నుంచి ‘ఎం5 ప్లస్’ స్మార్ట్ఫోన్ - Sakshi

హైదరాబాద్: మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ‘జియోనీ’ తాజాగా ‘మారథాన్ ఎం5 ప్లస్’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.26,999. ఆండ్రాయిడ్ 5.1 ఓఎస్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,020 ఎంఏహెచ్ బ్యాటరీ, 3 జీబీ ర్యామ్, ఫింగర్ ప్రింట్ సెక్యురిటీ ఆప్షన్, 64 జీబీ మెమరీ, 1.3 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4జీ, 6 అంగుళాల హెచ్‌డీ తెర వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది.

Advertisement
Advertisement