జియోని నుంచి రెండు 4జీ స్మార్ట్‌ఫోన్లు | Sakshi
Sakshi News home page

జియోని నుంచి రెండు 4జీ స్మార్ట్‌ఫోన్లు

Published Fri, Jun 12 2015 1:48 AM

జియోని నుంచి రెండు 4జీ స్మార్ట్‌ఫోన్లు

బీజింగ్: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ జియోని ‘ఇలైఫ్ ఇ8’, ‘మారథాన్ ఎం5’ అనే రెండు స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ 5.1 ఓఎస్‌పై నడిచే ‘ఇలైఫ్ ఇ8’ స్మార్ట్‌ఫోన్‌లో 24 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఆక్టాకోర్ ప్రాసెసర్, డ్యూయెల్ సిమ్, 4జీ, 6 అంగుళాల తెర, 64 జీబీ మెమరి, 3 జీబీ ర్యామ్, 3,520 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ధర రూ.41,000గా ఉంటుందని అంచనా. ఆండ్రాయిడ్ లాలిపప్ ఓఎస్, 5.5 అంగుళాల తెర, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4జీ, 16 జీబీ మెమరి, 2 జీబీ ర్యామ్ వంటి ప్రత్యేకతలు ‘మారథాన్ ఎం5’ స్మార్ట్‌ఫోన్ సొంతం. దీని ధర రూ.23,600 ఉంటుందని అంచనా.

Advertisement
Advertisement