రూ.9,000 కోట్ల వ్యయం
- నేపాల్లో అతిపెద్ద ఎఫ్డీఐ ఇదే
- విదేశాల్లో జీఎంఆర్కు ఇది భారీ పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ గ్రూప్నకు పెద్ద ఊరట. ఆరేళ్లుగా అనుమతికి నోచని భారీ ప్రాజెక్టుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. నేపాల్లో 900 మెగావాట్ల సామర్థ్యం గల అప్పర్ కర్నాలి హైడ్రో పవర్ ప్రాజెక్టును బిల్డ్, ఓన్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన జీఎంఆర్ 2008లో అంతర్జాతీయ పోటీ వేలంలో దక్కించుకుంది. ఆ దేశంలో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతూ వచ్చింది. విద్యుత్ కొరతతో కొట్టుమిట్టాడుతున్న భారత్కు ఈ ప్రాజెక్టు నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది కాబట్టి రాజకీయ పార్టీలు సైతం తమ దేశానికి పెద్ద ఎత్తున ప్రయోజనం కలగాలని పట్టుబడుతూ వచ్చాయి. సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు నేపాల్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్తోపాటు నేపాల్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 19న జీఎంఆర్తో ప్రాజెక్టు అభివృద్ధి ఒప్పందం(పీడీఏ) కుదిరింది. నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా, భారత హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో సంతకాలు జరిగాయి.
భారీ ఎఫ్డీఐ..: కర్నాలి నదిపై నిర్మించనున్న ఈ జల విద్యుత్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.9,000 కోట్లు. నేపాల్లోకి రానున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఇదే భారీది. ప్రాజెక్టులో 27 శాతం ఉచిత వాటా నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీకి జీఎంఆర్ ఇస్తుంది. కన్సెషన్ పీరియడ్ 25 ఏళ్లు. అంటే 25 ఏళ్ల తర్వాత ప్రాజెక్టు యాజమాన్య హక్కులు నేపాల్ ప్రభుత్వానికి బదిలీ అవుతాయి. తాజా ఒప్పందం ప్రభావంతో తమ దేశానికి మరిన్ని ఎఫ్డీఐలు కార్యరూపం దాలుస్తాయని నేపాల్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రాజెక్టును నిర్మించే ప్రాంతంలో 2 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని జీఎంఆర్ ప్రత్యేకంగా నెలకొల్పనుంది.
భారత్ వెలుపల..
జీఎంఆర్ గ్రూప్నకు భారత్ వెలుపల అతిపెద్ద ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. 2016 సెప్టెంబర్ నాటికి ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తి చేస్తామని కంపెనీ వెల్లడించింది. ప్రాజెక్టులో వాణిజ్య ఉత్పత్తి సెప్టెంబరు 2021 నాటికి ప్రారంభమవుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. ఏటా 3,500 మిలి యన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇందులో 12 శాతం నేపాల్కు ఉచితంగా ఇవ్వనున్నారు. మిగిలినది భారత్కు సరఫరా చేస్తారు. విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు ఈ సందర్భంగా చెప్పారు.
జీఎంఆర్ విద్యుత్ ప్రాజెక్ట్కు నేపాల్ ఓకే..
Published Tue, Sep 23 2014 12:23 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement