మళ్లీ పెరిగిన బంగారం ధర | Sakshi
Sakshi News home page

మళ్లీ పెరిగిన బంగారం ధర

Published Fri, Jun 20 2014 4:55 PM

మళ్లీ పెరిగిన బంగారం ధర

ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. పది గ్రాముల బంగారం 605 రూపాయిలు పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర 28,625 రూపాయిలకు చేరుకుంది.

ఇరాక్ సంక్షోభం ముదరడం వంటి అంశాలు పుత్తడి కొనుగోళ్లకు పురికొల్పాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిన్న రాత్రి అంటే గురువారం భారత్‌లోని మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో 10 గ్రాముల బంగారం ఫ్యూచర్స్ ధర రూ. 760కుపైగా పెరిగి రూ. 27,600 వద్దకు చేరుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం కూడా బంగారం ధర పెరిగే అవకాశముందన్న బులియన్ వర్గాల అంచనాల్ని తాజా పెరుగుదల నిజం చేసింది.

Advertisement
Advertisement