తాజాగా 322 పాయింట్లు పతనం
28,000 దిగువకు చేరిన సెన్సెక్స్
ప్రపంచ మార్కెట్ల నష్టాల ఎఫెక్ట్
అన్ని రంగాలూ తిరోగమనంలోనే
ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూలతలతో పాటు చైనా స్టాక్ మార్కెట్ హఠాత్తుగా 5.5% పతనం కావడంతో మరోసారి దేశీ స్టాక్ మార్కెట్లు క్షీణించాయి. రెండో త్రైమాసికంలో కరెంట్ ఖాతా లోటు పెరగడం కూడా సెంటిమెంట్ను బలహీనపరచింది. వెరసి సెన్సెక్స్ 322 పాయింట్లు పతనమై 28,000 పాయింట్ల దిగువకు చేరింది. 27,797 వద్ద ముగిసింది. ఇది ఆరు వారాల కనిష్టంకాగా, వరుసగా మూడు రోజుల్లో సెన్సెక్స్ 766 పాయింట్లు కోల్పోయింది. ఇక నిఫ్టీ సైతం 98 పాయింట్లు జారి 8,341 వద్ద నిలిచింది.
యూరప్ బలహీనం
ఆసియా మార్కెట్ల బలహీనతకుతోడు యూరోపియన్ ఇండెక్స్లు కూడా 1%పైబడ్డ నష్టాలకు లోనయ్యాయి. ఇందుకు వరుసగా నాలుగో క్వార్టర్లోనూ జర్మనీ ఎగుమతులు క్షీణించడం ప్రభావం చూపింది. మరోవైపు నవంబర్ నెలకు యూకేలో పారిశ్రామికోత్పత్తి అనూహ్యంగా 0.1%కు పడిపోయింది. దీంతో యూకే, జర్మనీ, ఫ్రాన్స్ ఇండెక్స్లు 1%పైగా నష్టాలతో కదులుతున్నాయి.
ఐదేళ్ల కనిష్టానికి చమురు
అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ చమురు మళ్లీ ఐదేళ్ల కనిష్టానికి జారింది. బ్యారల్ ధర 66 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. నిజానికి ఆయిల్ ధరల పతనం దేశీ ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూర్చే అంశమే అయినప్పటికీ, డాలరుతో మారకంలో రూపాయి విలువ క్షీణించడం ఇందుకు అడ్డుపడుతున్నట్లు నిపుణులు వ్యాఖ్యానించారు. కాగా, ప్రపంచ మార్కెట్ల ప్రతికూలతల నేపథ్యంలో ట్రేడింగ్ గడిచేకొద్దీ దేశీయంగానూ అమ్మకాలు ఊపందుకున్నాయి. ఫలితంగా బీఎస్ఈలో అన్ని రంగాలూ నష్టపోయాయి. ట్రేడైన షేర్లలో 2,045 నష్టపోగా, కేవలం 997 లాభపడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు 1.5% తిరోగమించాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో కేవలం నాలుగు మాత్రమే నిలదొక్కుకున్నాయి.
చైనా ప్రధాన స్టాక్ ఇండెక్స్ షాంఘై 5.5% పతనమైంది. 2009 తరువాత ఈ స్థాయిలో దిగజారడం తొలిసారికాగా, ఇందుకు పలు అంశాలు కారణమయ్యాయి. స్వల్పకాలిక ఫైనాన్సింగ్కు తక్కువ స్థాయి రేటింగ్ బాండ్లను అనుమతించేదిలేదంటూ చైనా సెక్యూరిటీస్ క్లియరింగ్ హౌస్ ఆదేశాలు జారీ చేయడంతో ఒక్కసారిగా సెంటిమెంట్ క్షీణించింది. దీంతో లిక్విడిటీకి అడ్డుకట్ట పడనుంది. దీనికితోడు 2015లో ఆర్థిక వ్యవస్థ 7%వృద్ధిని మించకపోవచ్చునంటూ ప్రభుత్వం పేర్కొనడం ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేసింది.
ప్రభుత్వం తొలుత 7.5% వృద్ధిని అంచనా వేయడం గమనార్హం. పైగా గత నెలరోజుల్లో చైనా షాంఘై సూచి 25 శాతం పెరగడంతో పాటు మూడేళ్ల తర్వాత తొలిసారిగా 3,000 పాయింట్ల స్థాయిని సూచి అధిగమించింది. ఈ నేపథ్యంలో లాభాల స్వీకరణ జరగడం కూడా తాజా పతనానికి కారణమని విశ్లేషకులు అంటున్నారు. దీంతో జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, ఇండోనేసియా సైతం 0.5% స్థాయిలో నీరసించాయి.
3 రోజుల్లో 766 పాయింట్లు డౌన్
Published Wed, Dec 10 2014 1:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
షర్మిల ఆడియో లీక్
మాకు ఓటు వేయకుంటే కరెంట్ కట్: కాంగ్రెస్ ఎమ్మెల్యే బెదిరింపు!
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. 48 గంటలపాటు ప్రచారం ఆపేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం .. ఇంకా ఇతర అప్డేట్స్
సింగర్ హత్య కేసు నిందితుడిపై కాల్పులు.. స్పాట్లోనే!
అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్
హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్
కైకేయి.. శూర్పణఖ... ఏదైనా ఓకే
జయహో జోయా
మన సర్పంచులు @ ఐరాస
కృష్ణమ్మతో సత్యదేవ్ స్టార్ అవుతాడు: రాజమౌళి
తప్పక చదవండి
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
Advertisement