న్యూఢిల్లీ: భారతీయ వినియోగదారులు హ్యుందాయ్ మోటార్ ఇండియా సేవలపై సంతృప్తి కనబరుస్తున్నట్లు గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ జేడీ పవర్ తెలియజేసింది. ఈ సంస్థ నిర్వహించిన 2017 ఇండియా కస్టమర్ సర్వీస్ ఇండెక్స్ (మాస్ మార్కెట్) సర్వే ప్రకారం.. విక్రయాల అనంతరం కస్టమర్ సంతృప్తి అంశంలో హ్యుందాయ్ 923 స్కోరుతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
కంపెనీ టాప్ ర్యాంక్ను సొంతం చేసుకోవడం ఇదే తొలిసారి. ఇక మారుతి సుజుకీ ఇండియా, టాటా మోటార్స్లు ఉమ్మడిగా రెండో స్థానాన్ని పంచుకున్నాయి. వీటి స్కోరు 893గా ఉంది. మహీంద్రా కంపెనీ 877 స్కోరుతో నాల్గవ స్థానంలో, నిస్సాన్ 844 స్కోరుతో ఐదో స్థానంలో నిలిచాయి. సర్వీసుల నాణ్యతకు భారతీయ కస్టమర్ల అధిక ప్రాధాన్యమిస్తున్నారని జేడీ పవర్ డైరెక్టర్ కౌస్తవ్ రాయ్ తెలిపారు.