రేటింగ్కు ప్రతికూలం: మూడీస్
న్యూఢిల్లీ: రుతుపవనాల బలహీనత భారత్కు పెద్ద ఇబ్బందేనని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ విశ్లేషించింది. ఇది దేశానికి రేటింగ్కు ప్రతికూలంగా(క్రెడిట్ నెగటివ్) మారే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాభావ పరిస్థితులు తలెత్తితే వ్యవసాయ రంగం (స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 17 శాతం) దెబ్బతింటుందని, ఆహార ధరలు ప్రపంచ సగటుకన్నా పెరుగుతాయని, సబ్సిడీలు, సహాయక చర్యల భారంతో ప్రభుత్వ లోటు అంశాలు క్లిష్టమవుతాయని మూడీస్ నివేదిక విశ్లేషించింది. వర్షాభావ అంచనాల నేపథ్యంలో మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ విడుదల చేసిన నివేదిక ముఖ్యాంశాలు.
- వర్షాభావం వల్ల ఏ స్థాయిలో ప్రతికూల ఫలితాలు ఉంటాయన్నది పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. వర్షాభావం ఏఏ ప్రాంతాల్లో ఉంది.. ప్రభుత్వం తీసుకున్న చర్యలు వంటి అంశాలు ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
- సగటు కుటుంబ వ్యయంలో 50% ఆహార పదార్థాలపైనే వెచ్చించడం జరుగుతుంది. అధిక ధరలు కుటుంబ బడ్జెట్ను భారీగా పెంచేస్తాయి. ఇది స్థూల దేశీయోత్పత్తిపై ప్రభావం చూపుతుంది.
- ఆహార ధరలు పెరిగినందువల్లే, భారత్లో 2012, 2013లో ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిని దాటింది.
- ద్రవ్యోల్బణం తగ్గడం, ప్రైవేటు రంగం వినియోగం పెరగడం, పెట్టుబడుల్లో వృద్ధి ధోరణి అంశాల వల్ల రిజర్వ్ బ్యాంక్ 2015లో 75 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించింది. అయితే బలహీన వర్షాభావ పరిస్థితుల్లో మరోదఫా రేటు కోత ఇప్పట్లో ఉండకపోవచ్చనీ సూచించింది. ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక ప్రతికూల అంశం.
- క్రెడిట్ రేటింగ్ నెగటివ్ అయితే, అంతర్జాతీయం గా రుణ సమీకరణ భారంగా మారడంతోపాటు, రుణాలు పొందడం కూడా క్లిష్టతరమవుతుంది.
- గత సంవత్సరం తరహాలోనే ఈ ఏడాది కూడా సగటు వర్షపాతంకన్నా 12 శాతం తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ ఇటీవల ప్రకటించింది. గత ఏడాది సాధారణంకన్నా తక్కువ వర్షపాతం వల్ల ధాన్యం, పత్తి, చమురు గింజల పంటలపై పడింది. గడచిన 50 సంవత్సరాల కాలంలో నమోదయిన వర్షపాతం సగటు- సాధారణ వర్షపాతానికి బెంచ్మార్క్.
వర్షాభావం భారత్కు ఇబ్బందే!
Published Tue, Jun 9 2015 1:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement