న్యూఢిల్లీ: ‘ఇండిగో’ ‘న్యూ ఇయర్ సేల్’ ఆఫర్ను ప్రకటించింది. ఇందులో భాగంగా సంస్థ రూ.899 ప్రారంభ ధరతో విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఈ సేల్ జనవరి 10 వరకు అందుబాటులో ఉంటుంది. ఆఫర్లో భాగంగా టికెట్లు బుక్ చేసుకున్న వారు ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు ఎప్పుడైనా ప్రయాణించొచ్చు.
కస్టమర్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకుంటే అదనంగా 10% డిస్కౌంట్ను, రూ.600 వరకు విలువైన ఇండిగో స్పెషల్ సర్వీస్ వోచర్లను పొందొచ్చు. అయితే వీటికి షరతులు వర్తిస్తాయి. ఈ ఆఫర్ ఎంపిక చేసిన ఫ్లైట్స్కు, పరిమిత సంఖ్యలోని సీట్లకు మాత్రమే వరిస్తుంది.