న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ షేర్ల బైబ్యాక్లో ప్రమోటర్లు జోరుగానే పాల్గొంటున్నారు. ఎన్ఆర్ నారాయణమూర్తి, నందన్ నీలేకనితో పాటు ఇతర సహ–వ్యవస్థాపకులు తమవద్దనున్న వాటాల్లో 1.77 కోట్ల షేర్లను బైబ్యాక్లో విక్రయించేందుకు ముందుకొచ్చారు. వీటి విలువ దాదాపు రూ.2,038 కోట్లుగా అంచనా. ఒక్కో షేరుకి రూ.1,150 చొప్పున మొత్తం రూ.13,000 కోట్ల విలువైన బైబ్యాక్ ఆఫర్ను(దాదాపు 11.3 కోట్ల షేర్లు) ఇన్ఫోసిస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కంపెనీ చరిత్రలో ఇది తొలి బైబ్యాక్ కావడం గమనార్హం.
ప్రమోటర్లతో ముఖ్యంగా నారాయణమూర్తితో విభేదాల కారణంగా కంపెనీ సీఈఓ పదవికి విశాల్ సిక్కా అర్ధంతరంగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆతర్వాత జరిగిన పరిణామాల్లో చైర్మన్ ఆర్.శేషసాయి మరికొందరు బోర్డు సభ్యులు కూడా వైదొలిగారు. సంస్థాగత ఇన్వెస్టర్ల ఒత్తిడితో ఇన్ఫీ సహ–వ్యవస్థాపకుడు నందన్ నీలేకని చైర్మన్ పగ్గాలను అందుకున్నారు. ఇక ఇప్పుడు కొత్త సీఈఓ–ఎండీ నియామకంపై కంపెనీ బోర్డు తీవ్రంగా దృష్టిసారిస్తోంది. సిక్కా రాజీనామా ఉదంతంతో ఇన్ఫీ షేరు ధర దాదాపు 15 శాతం మేర కుప్పకూలిన విషయం విదితమే. నీలేకని రీఎంట్రీతో కొద్దిగా కోలుకొని ప్రస్తుతం రూ.920 వద్ద కదలాడుతోంది.
నీలేకని, మూర్తివే ఎక్కువ...
ఇన్ఫీ సహ–వ్యవస్థాపకులు వారి కుటుంబ సభ్యులకు కలిపి మొత్తం ప్రమోటర్ల గ్రూప్నకు ఈ ఏడాది జూన్ చివరినాటికి కంపెనీలో 12.75 శాతం(29.28 కోట్ల షేర్లు) వాటాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రమోటర్లు ఆఫర్చేస్తున్న మొత్తం షేర్లను(1.77 కోట్ల షేర్లు) బైబ్యాక్లో కంపెనీ ఆమోదిస్తే... వారికి లాభాల పంటపండినట్లే. బైబ్యాక్లో విక్రయం కోసం ప్రమోటర్లకు సంబంధించి నీలేకని, మూర్తి ఆఫర్ చేసిన షేర్లే ఎక్కువగా ఉన్నాయి. నీలేకని(కుటుంబం) 58 లక్షల షేర్లను, మూర్తి(భార్య సుధ, ఇద్దరు పిల్లలతో కలిపి) 54 లక్షల షేర్లను విక్రయానికి ఉంచుతున్నారు. ఇక ఎస్.గోపాలకృష్ణన్ కుటుంబం 22 లక్షల షేర్లను, కె.దినేష్ 29 లక్షల షేర్లను విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫీ ప్రమోటర్లలో వ్యక్తితంగా అత్యధిక వాటా(2.14 శాతం) గోపాలకృష్ణన్ భార్య సుధా గోపాలకృష్ణన్కే ఉండటం విశేషం. కాగా, మరో ప్రమోటర్ ఎస్డీ శిబులాల్ బైబ్యాక్లో పాల్గొనడం లేదు. ఆయన భార్య, కుమారుడు మాత్రం 14 లక్షల షేర్లను విక్రయానికి పెడుతున్నారు.
బైబ్యాక్లో ఇన్ఫీ ప్రమోటర్లు రూ.2 వేల కోట్ల షేర్ల విక్రయం!
Published Mon, Sep 4 2017 1:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement