ఇన్ఫీకి ఫలితాల షాక్‌ | Sakshi
Sakshi News home page

ఇన్ఫీకి ఫలితాల షాక్‌

Published Mon, Apr 16 2018 10:15 AM

Infosys shares fall 5percent - Sakshi

సాక్షి,ముంబై:   దేశంలోని రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ సర్వీసుల సంస్థ ఇన్ఫోసిస్‌కు ఫలితాల షాక్‌ తగిలింది.  మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగానే   నికర లాభాలను  సాధించినప్పటికీ ఇవాల్టి మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ముఖ్యంగా ఆపరేటింగ్‌ మార్జిన్ల బాండ్లను తగ్గించడంతో   ఇనెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతింది.  దీంతో ఆరంభంలోనే భారీగా నష్టపోయింది. 5.3 శాతం క్షీణించి రూ .1,107కు పడిపోయింది. 14 బ్లాక్స్‌ డీల్స్‌ ద్వారా సుమారు 85 లక్షల షేర్లు చేతులు మారాయి.  కాగా  2018-19  సంవత్సరానికిగాను ఇన్ఫోసిస్ ఆపరేటింగ్ మార్జిన్ బ్యాండ్స్‌ను 22-24 శాతం తగ్గించింది.

Advertisement
Advertisement