డెరివేటివ్స్ ముగింపు నేపథ్యంలో ఒడిదుడుకులు
* 49 పాయింట్ల నష్టంతో 25,819కు సెన్సెక్స్
* 7 పాయింట్ల నష్టంతో 7,849కు నిఫ్టీ
* హిందాల్కో, వేదాంతకు భారీ నష్టాలు...
డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో సోమవారం ఆద్యంతం ఊగిసలాటకు గురైన స్టాక్మార్కెట్ చివరకు నష్టాల్లో ముగిసింది. దీంతో రెండు ట్రేడింగ్ సెషన్ల లాభాలకు బ్రేక్ పడింది. బుధవారం సెలవు కారణంగా ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కావడంతో ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరించారు.
బీఎస్ఈ సెన్సెక్స్ 49 పాయింట్ల నష్టంతో 25,819 పాయింట్ల వద్ద, నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోయి 7,849 పాయింట్ల వద్ద ముగిశాయి. లోహ షేర్లు బాగా నష్టపోయాయి. హీరో మోటొకార్ప్, బజాజ్ ఆటో, లుపిన్ షేర్లు లాభపడటంతో నష్టాలు తగ్గాయి.
ఆచి, తూచి: ఆసియా మార్కెట్లు బలహీనంగా ముగియడం, డాలర్ బలపడుతుండడం, చైనా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు, రూపాయి పతనం, యూరోప్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం కావడం.. ఇవన్నీ ప్రతికూల ప్రభావం చూపాయి.
సెన్సెక్స్ నుంచి హిందాల్కో, వేదాంత తొలగింపు..: లండన్ మార్కెట్లో రాగి ధరలు ఆరేళ్ల కనిష్టానికి పడిన నేపథ్యంలో లోహ షేర్లు నష్టపోయాయి. వేదాంత, హిందాల్కో, టాటా స్టీల్ షేర్లు 2-4 %మేర పడ్డాయి. సెన్సెక్స్ నుంచి వేదాంత, హిందాల్కో షేర్లను వచ్చే నెల 21 నుంచి తొలగిస్తున్నట్లు బీఎస్ఈ ప్రకటన నేపథ్యంలో హిందాల్కో, వేదాంత షేర్లు బాగా నష్టపోయాయి. హిందాల్కో 3.8% నష్టపోయి రూ.74 వద్ద, వేదాంత 2.9% నష్టపోయి రూ.90 వద్ద ముగిశాయి.
ఏడాది కాలంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ వేదాంత కంపెనీది రూ.42,000 కోట్లు, హిందాల్కోది రూ.16,000 కోట్లు చొప్పున హరించుకుపోయాయి. హిందాల్కో, వేదాంత షేర్ల నిష్ర్కమణతో సెన్సెక్స్లో ఏకైక లోహ షేర్గా టాటా స్టీల్ నిలిచింది. ఈ నెల 13న రూ.282గా ఉన్న గెయిల్ ధర పది రోజుల్లో 23%వృద్ధి చెంది సోమవారం రూ.346 వద్ద ముగిసింది. ఈ కంపెనీకి 49.75 %వాటా ఉన్న మహానగర్ గ్యాస్ సెబీకి ఐపీఓ పత్రాలను సమర్పించిన నేపథ్యంలో ఈ షేర్ జోరుగా పెరుగుతోంది.
హెల్త్కేర్ గ్లోబల్ ఐపీఓకు సెబీ అనుమతి
న్యూఢిల్లీ: కేన్సర్ కేర్ నెట్వర్క్ సంస్థ హెల్త్కేర్ గ్లోబల్ ఎంటర్ప్రెజైస్(హెచ్సీజీ) తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఆమోదం లభించింది, బెంగళూరు కేంద్రంగా పనిచేసే హెచ్సీజీ ఈ ఐపీఓ ద్వారా 1.16 కోట్ల తాజా షేర్లతో పాటు ప్రమోటర్ల 1.95 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయిస్తారు. హెచ్సీజీ బ్రాండ్ కింద ఈ కంపెనీ 15 సమగ్రమైన క్యాన్సర్ సెంటర్లను నిర్వహిస్తోంది.
లోహ షేర్లు విలవిల..!
Published Tue, Nov 24 2015 2:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement