జేఎల్‌ఆర్ ‘ఎక్స్‌ఎఫ్ సెలూన్’.. కొత్త వేరియంట్ | Sakshi
Sakshi News home page

జేఎల్‌ఆర్ ‘ఎక్స్‌ఎఫ్ సెలూన్’.. కొత్త వేరియంట్

Published Thu, Jul 2 2015 11:43 PM

జేఎల్‌ఆర్ ‘ఎక్స్‌ఎఫ్ సెలూన్’.. కొత్త వేరియంట్

ధర రూ.  52 లక్షలు
 
న్యూఢిల్లీ : టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్‌ఆర్) జాగ్వార్ ఎక్స్‌ఎఫ్ సెలూన్‌లో కొత్త వేరియంట్‌ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఎక్స్‌ఎఫ్ ఏరో-స్పోర్ట్ పేరుతో అందిస్తున్న ఈ కొత్త వేరియంట్  ధర రూ.52 లక్షలు(ఎక్స్ షోరూమ్, ముంబై)అని జేఎల్‌ఆర్ ఇండియా ప్రెసిడెంట్ రోహిత్ సూరి చెప్పారు. 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో అందిస్తున్న ఈ కారు ఎక్స్‌టీరియర్స్‌ను ఒక రేంజ్‌లో అప్‌గ్రేడ్ చేశామని పేర్కొన్నారు. టచ్ స్క్రీన్, నావిగేషన్ సిస్టమ్, సన్‌రూఫ్ వంటి అదనపు ఫీచర్లను అందిస్తున్నామని పేర్కొన్నారు. 19 నగరాల్లోని 21 అవుట్‌లెట్లలో జాగ్వార్ మోడళ్లు లభ్యమవుతాయని ఆయన వివరించారు.

Advertisement
Advertisement