రూ.136 కోట్లు సమీకరించిన నోలారిటీ | Sakshi
Sakshi News home page

రూ.136 కోట్లు సమీకరించిన నోలారిటీ

Published Tue, Nov 29 2016 1:27 AM

రూ.136 కోట్లు సమీకరించిన నోలారిటీ

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : సింగపూర్ కేంద్రంగా పనిచేసే క్లౌడ్ ఆధారిత టెలిఫోన్ కంపెనీ నోలారిటీ తాజాగా రూ.136 కోట్ల (20 మిలియన్ డాలర్లు) నిధులను సమీకరించింది. సీరిస్-సీలో భాగంగా దుబాయ్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ డెల్టా పార్టనర్స్, సిక్వోయా క్యాపిటల్, మేఫీల్డ్ ఇన్వెస్టర్లు ఈ పెట్టుబడులు పెట్టారుు.

వీటితో కలిపి నోలారిటీ ఇప్పటివరకు 41 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించినటైంది. తాజా నిధులతో ప్రపంచ దేశాల్లో విస్తరణతో పాటూ ఇతర క్లౌడ్ కంపెనీల కొనుగోళ్లకూ వినియోగిస్తామని నోలారిటీ ఫౌండర్ అండ్ సీఈఓ అంబరీష్ గుప్తా చెప్పారు. 2009లో ప్రారంభమైన నొలారిటీకి మన దేశంలో 300లకు పైగా ఉద్యోగులు, 8 కార్యాలయాలున్నారుు. మొత్తంగా 20 లక్షలకు పైగా కస్టమర్లున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement