సంస్థ చైర్మన్ను రాష్ట్రానికి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా తెచ్చిన పారిశ్రామిక విధానం(టీఎస్-ఐపాస్) పట్ల ప్రఖ్యాత నెట్వర్కింగ్ కంపెనీ సిస్కో సిస్టమ్స్ చైర్మన్ జాన్ చాంబర్స్ ఆసక్తిని కనబరిచారు. అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావు శనివారం శాన్జోస్ నగరంలోని సిస్కో కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. టీఎస్-ఐపాస్లోని కీలక అంశాలను సిస్కో చైర్మన్కు మంత్రి కేటీఆర్ వివరించారు. పారదర్శకమైన పారిశ్రామిక విధానం, పరిపాలనా సౌల భ్యాన్ని అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి జాన్ చాంబర్స్ అభినందనలు తెలిపారు.
తెలంగాణలో పరిశ్రమల స్థాపనకున్న విస్తృత అవకాశాలను పరిశీలించేందుకు రాష్ట్రానికి రావాలని సిస్కో చైర్మన్ను మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. ఆ తర్వాత ఎలక్ట్రికల్ రంగంలో పేరుగాంచిన జనరల్ ఎలక్ట్రికల్స్(జీఈ) సంస్థ మాజీ చైర్మన్ జాక్వెల్స్తో మంత్రి కేటీఆర్ సంభాషించారు. జాక్వెల్స్ వంటి పారిశ్రామిక వేత్త ఇచ్చిన సూచనలు, సలహాలు తెలంగాణ అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని మంత్రి తెలిపారు.
అనంతరం శాంతాక్లారా కన్వెన్షన్ సెంటర్లో ది ఇండస్ ఎంటర్పెన్యూర్స్ ఏర్పాటు చేసిన టైకాన్ సదస్సులో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణలో స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ-హబ్ ప్రత్యేకతలను వారికి వివరించారు. ఆపై సన్ మైక్రో సిస్టమ్స్ సహ వ్యవస్థాపకుడు వినోద్కోస్లాతో భేటీ అయిన కేటీఆర్.. సాంకేతిక రంగానికి సంబంధించి ప్రపంచంలో వస్తున్న అధునాతన మార్పులపై చర్చించారు.
టీఎస్-ఐపాస్పై సిస్కో ఆసక్తి
Published Sun, May 17 2015 2:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement