మహీంద్రా ‘జీతో మినీవ్యాన్‌’ | Sakshi
Sakshi News home page

మహీంద్రా ‘జీతో మినీవ్యాన్‌’

Published Fri, Jul 14 2017 1:08 AM

మహీంద్రా ‘జీతో మినీవ్యాన్‌’ - Sakshi

@రూ.3.45 లక్షలు
ముంబై: ‘మహీంద్రా అండ్‌ మహీంద్రా’ తాజా గా ‘జీతో’ సిరీస్‌లో ‘మినీవ్యాన్‌’ వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇది ప్రయాణికులను తీసుకెళ్లే ఒక చిన్నతరహా వాణిజ్య వాహనం. దీని ధర రూ.3.45 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌ ముంబై) ఉంది. జీతో మినీవ్యాన్‌లో 625 సీసీ డీజిల్‌ ఇంజిన్‌ అమర్చామని, ఇది లీటరుకు 26 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. పెట్రోల్, సీఎన్‌జీ ఇంజిన్‌ ఆప్షన్లను త్వరలోనే మార్కెట్‌లోకి తెస్తామని పేర్కొంది.

Advertisement
Advertisement