- ప్రత్యేక ఎడిషన్ ధర రూ. 13.68 లక్షలు
- విక్రయానికి వెయ్యి వాహనాలు మాత్రమే...
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ స్పోర్ట్జ్ యుటిలిటీ వెహికల్ మోడల్ ఎక్స్యూవీ500లో లిమిటెడ్ ఎడిషన్ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఎక్స్యూవీ500 స్పోర్ట్జ్పేరుతో అందిస్తున్న ఈ స్పెషల్ ఎడిషన్ ఎస్యూవీ ధర రూ.13.68 లక్షల(ఎక్స్ షోరూమ్, ముంబై)ని ఎం అండ్ ఎం చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ (ఆటోమోటివ్ డివిజన్) వివేక్ నాయర్ పేర్కొన్నారు. రియర్ వ్యూ కెమెరా, లెదర్-ఫ్యాబ్రిక్ సీట్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్(ఈఎస్ిపీ), హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, 6 గేర్లు, 6 ఎయిర్బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ బ్రేక్ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్(ఈబీడీ)తో కూడిన ఏబీఎస్ వంటి ఆకర్షణలతో ఈ స్పెషల్ ఎడిషన్ను అందిస్తున్నామని వివరించారు.
ఎస్యూవీ కేటగిరీలో కొత్త ఒరవడిని ఈ స్పెషల్ ఎడిషన్ సృష్టిస్తుందని పేర్కొన్నారు. ఎక్స్యూవీ 500లో ఇదే హై ఎండ్ మోడల్ అని తెలిపారు. కాగా వెయ్యి వాహనాలను మాత్రమే అందిస్తున్నామని కంపెనీ చీఫ్ సేల్స్ అండ్ కస్టమర్ కేర్ ఆఫీసర్ (ఆటోమోటివ్ డివిజన్) అరుణ్ మల్హోత్ర చెప్పారు. 2011లో ఎక్స్యూవీ 500 మోడల్ను మార్కెట్లోకి తెచ్చామని, ఇప్పటిదాకా 75 వేల వాహనాలను విక్రయించామని తెలిపారు. 4-5 నెలల్లో లక్ష విక్రయాల మైలురాయిని సాధిస్తామని చెప్పారు.