51% వాటా కొనుగోలుకు ఒప్పందం
డీల్ విలువ రూ. 217 కోట్లు
ముంబై: ఆటోమొబైల్ సంస్థ ప్యూజో మోటోసైకిల్స్లో 51 శాతం వాటాలను దేశీ దిగ్గజం మహీంద్రా టూ వీలర్స్ కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ సుమారు 28 మిలియన్ యూరోలు (దాదాపు రూ. 217 కోట్లు). ఇందుకు సంబంధించిన ఒప్పందంపై మంగళవారం ఇరువర్గాలు సంతకాలు చేశాయి. ఫ్రాన్స్కి చెందిన ఆటోమొబైల్ దిగ్గజం పీఎస్ఏ గ్రూప్లో ప్యూజో మోటోసైకిల్స్ భాగం. తాజా బైండింగ్ ఒప్పందం ప్రకారం వ్యూహాత్మక భాగస్వామ్య ప్రాజెక్టులకు నిధులు సమకూర్చే దిశగా మహీంద్రా టూ వీలర్స్ సంస్థ.. ముందుగా ప్యూజోలో 15 మిలియన్ యూరోలు ఇన్వెస్ట్ చేస్తుంది. తదుపరి మరో 13 మిలియన్ యూరోలు ఇన్వెస్ట్ చేస్తుంది.
ఇతరత్రా నియంత్రణపరమైన అనుమతులకు లోబడి డీల్ మూడు నెలల్లోగా పూర్తి కావొచ్చని మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పవన్ గోయెంకా తెలిపారు. రెండేళ్ల పాటు ఎటువంటి పునర్వ్యవస్థీకరణ చర్యలు ఉండవని, ఇప్పుడున్న మేనేజ్మెంట్ బృందాన్నే కొనసాగించనున్నట్లు తెలిపారు. ఎంఅండ్ఎంతో ఒప్పందం తమ కార్యకలాపాల విస్తరణకు దోహదపడగలదని ప్యూజో స్కూటర్స్ ఎండీ ఫ్రెడరిక్ ఫేబర్ పేర్కొన్నారు. దాదాపు 116 ఏళ్ల చరిత్ర గల ప్యూజో యూరప్లో ద్విచక్ర వాహనాలు, కార్ల తయారీకి పేరొం దింది. ప్రస్తుతం కంపెనీ ద్విచక్రవాహనాల విభాగం నష్టాల్లో ఉంది. మరోవైపు, కొన్నాళ్ల క్రితమే ద్విచక్ర వాహనాల విభాగంలోకి అడుగుపెట్టిన ఎంఅండ్ఎం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజా ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, మంగళవారం ఎంఅండ్ఎం షేరు బీఎస్ఈలో 2.3% నష్టంతో రూ. 1,359 వద్ద క్లోజైంది.
మహీంద్రా చేతికి ప్యూజో మోటోసైకిల్స్
Published Wed, Oct 8 2014 1:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement